Katrina Kaif: నిద్ర రాకపోతే ఈ హీరోయిన్ అది చేయమని అడుగుతుందట

Katrina Kaif: బాలీవుడ్ టాప్ హీరోయిన్ కత్రినా కైఫ్ గత పది సంవత్సరాల నుంచి ఇండస్ట్రీ ని ఏలుతోంది. ఇండస్ట్రీ లోకి అడుగు పెట్టి ఇన్ని సంవత్సరాలైనా తన అందం ఏ మాత్రం తగ్గలేదు. అలా తన అందం తో ఇప్పటికి కుర్రకారు మనసులని దోచుకుంటోంది. ఇన్ని ఏళ్ళైనా తనలో జోరు మాత్రం తగ్గలేదు. ఇలా ఒక బాలీవుడ్ లోనే కాకుండా ఇతర భాషల్లో కూడా తాను నటించింది.

అయితే తాను తెలుగులో నటించిన చిత్రం మాత్రం మల్లీశ్వరి. ఈ చిత్రంలో వెంకటేష్ సరసన కత్రినా కైఫ్ నటించింది. ఇలా మల్లీశ్వరి సినిమాతో తెలుగు ప్రేక్షకులకు దగ్గరైంది. ఆ తర్వాత అల్లరి పిడుగు అనే సినిమాలో నటించినా ఆ సినిమాను పెద్దగా ఎవరు గుర్తు పెట్టుకోలేదు. కానీ మల్లీశ్వరి సినిమాతోనే తెలుగులో మంచి గుర్తింపు ని తెచ్చుకుంది. ఇప్పటికీ ఈ సినిమా టీవీ లో ప్రసారమైతే కేవలం కత్రినా కైఫ్ కోసమే చూసే వాళ్ళు ఉన్నారంటే అతిశయోక్తి కాదు.

ఇక ఆ తర్వాత తన పూర్తి దృష్టి మొత్తం బాలీవుడ్ పైనే పెట్టింది. ఇప్పటికీ తాను సినిమాలు చేస్తూనే ఉంది. అయితే మొదట్లో బడా హీరోలతో ప్రేమాయణాలు నడిపింది. ఇక పరిశ్రమలో ప్రేమ వ్యవహారాలు అంటే కామనై పోయాయి. ఎవరు ఎప్పుడు ఒకటవుతారో ఎప్పుడు విడిపోతారో ఎవరికీ తెలియదు. ఇలా ప్రేమలకి ఫుల్ స్టాప్ పెట్టేసి కొత్ జీవితాన్ని ప్రారంభించింది. కత్రినా కైఫ్ విక్కీ కౌశల్ అనే వ్యక్తి ని పెళ్లి చేసుకుంది.

తమ వైవాహిక జీవితం గురించి కొన్ని ఆసక్తికరమైన విషయాలను పంచుకుంది. అదేమిటంటే విక్కీ కౌశల్ మంచి డాన్సర్ అని, అలాగే మంచి గాయకుడు అని చెప్పింది. అయితే తనకు నిద్ర రానప్పుడు తనతో పాటలు పాడించుకుంటానని, తాను పాటలు పాడితే అమ్మ జోల పాట పాడినట్టు ఉంటుందని, తన పాటకు వెంటనే నిద్ర పడుతుందని చెప్పుకొచ్చింది.

Related Articles

ట్రేండింగ్

Chandrababu Naidu: చంద్రబాబు నాయుడు రెండో సంతకం ఆ ఫైలుపైనే.. ఆ యాక్ట్ ను రద్దు చేయనున్నారా?

Chandrababu Naidu: ఎన్నికల ప్రచారంలో భాగంగా చంద్రబాబు నాయుడు ప్రకాశం జిల్లాలోని చీరాలలో నిర్వహించిన ప్రజాగళం సభలో మాట్లాడారు. తాము అధికారంలోకి వస్తే చేయబోయే కార్యకలాపాల గురించి ఆ సభలో మాట్లాడారు. అధికారంలోకి...
- Advertisement -
- Advertisement -