Balakrishna: బాలయ్యకు రష్మిక కాల్ చేయడానికి కారణమిదేనా?

Balakrishna: నందమూరి బాలకృష్ణ హోస్ట్ గా వ్యవహరిస్తున్న షో అన్ స్టాపబుల్. ప్రముఖ ఓటీటీ యాప్ ఆహాలో రెండో సీజన్ ప్రస్తుతం స్ట్రీమింగ్ అవుతోంది. తాజాగా విడుదలైన ప్రోమోలో బాలయ్య.. హీరోయిన్ రష్మికతో వీడియో కాల్ మాట్లాడారు. కాల్ పూర్తయ్యాక ఫోన్ తీసుకొని జేబులో పెట్టేసుకుంటారు బాలయ్య. ఈ ప్రోమో ఆసక్తికరంగా ఉంది.

ఈసారి బాలయ్య అన్ స్టాపబుల్ షోకు ఇద్దరు కుర్ర హీరోలు వచ్చారు. వాళ్లే శర్వానంద్, అడివి శేష్. వీరిద్దరితో కలిసి బాలయ్య సందడి చేశారు. ఈ ముగ్గురి మధ్య జరిగిన సంభాషణ ప్రోమోలో చూపించారు. ఇందులో బాలయ్య, శర్వానంద్ మధ్య డైలాగులు పేలాయి. వచ్చీ రాగానే బాలయ్యకు ఓ గిఫ్ట్ అంటూ శర్వానంద్ జేబులోంచి ఫోన్ తీస్తాడు.

ఫోన్ లో వీడియో కాల్ చేసి రష్మికతో మాట్లాడిస్తాడు శర్వానంద్. బాలయ్య, రష్మిక ఫోన్ లో మాట్లాడుకుంటారు. రష్మికతో బాలయ్య మాట్లాడిన తీరు.. ఉత్సాహం అందరినీ ఆకట్టుకుంటాయి. కాల్ అయిపోయాక బాలయ్య రష్మిక మాట్లాడిన ఫోన్ ను జేబులో పెట్టేసుకుంటాడు. గుండెలకు హత్తుకుంటాడు. తాజాగా రిలీజైన ప్రోమోలో ఇది హైలెట్ గా నిలిచింది.

రోజు రోజుకూ క్రేజ్ పెంచుకుంటున్న రష్మిక..

రెండో ఎపిసోడ్ లో తన క్రష్ ఎవరని అడిగితే బాలయ్య రష్మిక అని చెబుతాడు. ఈ ఎపిసోడ్ లో బాలయ్యతో రష్మిక మాట్లాడేలా శర్వానంద్ చేస్తాడు. ఇది ప్రస్తుతం వైరల్ గా మారింది. బాలయ్యకు రష్మిక అంటే అంత ప్రేమా అని నెటిజన్లు కామెంట్ చేస్తున్నారు. పుష్ప సినిమా తర్వాత రష్మిక రేంజ్ పెరిగింది. ఎక్కడ చూసినా రష్మిక పేరే వినిపిస్తోంది. ఇంతకుముందే నేషనల్ క్రష్ అనే బిరుదు ఇచ్చారు ఫ్యాన్స్. ఇప్పుడు అది కాస్తా రెట్టింపయినట్లుగా ఫేమ్ అవుతోంది రష్మిక.

Related Articles

ట్రేండింగ్

Chandrababu Naidu: చంద్రబాబు నాయుడు రెండో సంతకం ఆ ఫైలుపైనే.. ఆ యాక్ట్ ను రద్దు చేయనున్నారా?

Chandrababu Naidu: ఎన్నికల ప్రచారంలో భాగంగా చంద్రబాబు నాయుడు ప్రకాశం జిల్లాలోని చీరాలలో నిర్వహించిన ప్రజాగళం సభలో మాట్లాడారు. తాము అధికారంలోకి వస్తే చేయబోయే కార్యకలాపాల గురించి ఆ సభలో మాట్లాడారు. అధికారంలోకి...
- Advertisement -
- Advertisement -