Nara Brahmani: బాలయ్య కూతురు చేసిన్ ఈ పని గురించి తెలిస్తే షాకవ్వాల్సిందే!

Nara Brahmani: నందమూరి నటసింహం బాలకృష్ణ సినిమాలోనే కాకుండా నిజ జీవితంలో కూడా ఎంత డైనమిక్కో మన అందరికీ తెలుసు. ఆమె పెద్ద కూతురు బ్రాహ్మణి కూడా ధైర్యం లో తండ్రికి ఏమాత్రం తీసిపోదు అని నిరూపించుకుంది. నారా ఇంటి కోడలైన ఈ నందమూరి ఆడపడుచు ఇప్పటికే హెరిటేజ్ బాధ్యతలు చేపట్టి ఎంతో సమర్థవంతమైన బిజినెస్ ఉమెన్ గా గుర్తింపు పొందింది.

ఇప్పుడు ఆమె తనలోని మరో ప్రతిభను బయటపెట్టి అందరిని ఆశ్చర్యపరచండి. బైక్ ట్రావెలర్ గా తాను చేస్తున్న సాహసాల గురించి సోషల్ మీడియాలో పోస్టులు , వీడియోలు పెడుతుంది.

ప్రస్తుతం తన అడ్వెంచర్ ట్రిప్ లో భాగంగా లడఖ్‌లోని లేహ్ ప్రాంతానికి వెళ్లిన బ్రాహ్మణి ఇక్కడి నుంచి బైక్లో బయలుదేరింది. చిన్నప్పటినుంచి బైక్ రైడింగ్ అంటే ఎంతో మక్కువ కలిగిన బ్రాహ్మణి ఒక ప్రొఫెషనల్ బైక్ రైడింగ్ గ్రూప్ లో సభ్యురాలు.జావా యజ్ది స్పోర్ట్స్ బైక్ మీద లేహ్ – లడక్ లాంటి హిల్ స్టేషన్ ఏరియాలో ప్రస్తుతం ఆమె ప్రయాణిస్తున్నారు.

ఎంతో బరువుగా ఉన్న బైకును సునాయాసంగా హ్యాండిల్ చేస్తూ అలుపు సొలుపు లేకుండా బ్రాహ్మణి అంత పెద్ద ట్రిప్ కు వెళ్లడం చూసి అందరూ “భళా బ్రాహ్మణి” అని పొగుడుతున్నారు. ఆమె నడుపుతున్న బైక్ కలర్ సైతం పసుపు వర్ణంలో ఉండడం ఇంకో విశేషం. ఈ ట్రిప్ లో భాగంగా స్పిరిచువల్ జర్నీ ఎక్స్పీరియన్స్ గురించి అనుభవాలను షేర్ చేస్తూ బ్రాహ్మిని సోషల్ మీడియాలో అప్లోడ్ చేసిన వీడియో ప్రస్తుతం వైరల్ గా మారింది.

అటు సినీ ,ఇటు రాజకీయ కుటుంబ నేపథ్యాలు ఉన్నప్పటికీ తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును సంపాదిస్తూ హెరిటేజ్ సంస్థను ఎంతో విజయవంతంగా నిర్వహిస్తున్న నేటి మహిళగా బ్రాహ్మణి కి ఇప్పటికే మంచి గుర్తింపు ఉంది. కానీ ఇప్పుడు ఆమె వెళ్లిన అడ్వెంచర్స్ ట్రిప్ గురించి తెలుసుకున్న అందరూ మాత్రం ఆమెను ఒక లేడీ ఐకాన్ గా చూస్తున్నారు.

Related Articles

ట్రేండింగ్

CM Jagan: కూటమి విజయాన్ని ఫిక్స్ చేసిన జగన్.. మేనిఫెస్టో హామీలతో బొక్కా బోర్లా పడ్డారా?

CM Jagan: త్వరలోనే అసెంబ్లీ ఎన్నికలు జరగబోతున్నటువంటి తరుణంలో పెద్ద ఎత్తున ప్రచార కార్యక్రమాలలో నిర్వహిస్తున్నారు. అయితే వైసిపి అధినేత జగన్మోహన్ రెడ్డి వై నాట్ 175 అంటూ ప్రచార కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు....
- Advertisement -
- Advertisement -