Assembly Polls: ఆంధ్రప్రదేశ్లో ఎన్నికల హీట్ పెరిగిపోతుంది మరి కొద్ది రోజులలో ఎన్నికలు జరగబోతున్నటువంటి తరుణంలో ఏ పార్టీ విజయం కైవసం చేసుకుంటుంది అన్న ఆత్రుత కేవలం ఏపీ ప్రజలకు మాత్రమే కాకుండా ఇతర రాష్ట్రాలలో వారికి కూడా ఆసక్తి నెలకొంది అని చెప్పాలి. మే 13వ తేదీ ఎన్నికలు జరగబోతున్నటువంటి తరుణంలో ఇప్పటికే అన్ని పార్టీ అధినేతలు ఎమ్మెల్యే ఎంపీ అభ్యర్థులు ప్రచార కార్యక్రమాలను వేగవంతం చేశారు.
ఇక ఈ ఎన్నికలలో భాగంగా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి మేమంతా బస్సు యాత్రలో భాగంగా రాష్ట్రవ్యాప్తంగా పర్యటన చేస్తూ ఉండగా ఆయన సతీమణి భారతి పులివెందులలో ప్రచార కార్యక్రమాల బాధ్యతలను తీసుకొని పులివెందులలో ప్రచార కార్యక్రమాలను మొదలుపెట్టారు. మరోవైపు ప్రజా గళం పేరిట చంద్రబాబునాయుడు రాష్ట్రవ్యాప్తంగా పర్యటన చేస్తూ ఉండగా ఆయన సతీమణి నారాభువనేశ్వరి నిన్న నామినేషన్ దాఖలు చేశారు
చంద్రబాబు నాయుడు ప్రచార కార్యక్రమాలలో బిజీగా ఉన్న తరుణంలో ఆయన నామినేషన్ స్వయంగా భువనేశ్వరి పూజలు చేయించి మరి దాఖలు చేశారు మరోవైపు నారా లోకేష్ సతీమణి నారా భువనేశ్వరి సైతం మంగళగిరిలో పెద్ద ఎత్తున పర్యటిస్తూ అక్కడ ప్రజల సమస్యలను తెలుసుకుంటూ వాటిని త్వరలోనే పరిష్కరిస్తామని భరోసా ఇస్తున్నారు.
మరోవైపు ఎమ్మెల్యే బాలకృష్ణ సైతం హిందూపురంలో తన భార్య వసుంధరతో కలిసి నామినేషన్ వేశారు ఇలా ప్రతి ఒక్కరు కూడా తమ భర్తల విజయం కోసం పోరాటం చేస్తూ ఉన్నారు ప్రతి మగాడి విజయం వెనుక ఆడది ఉంటుంది అంటారు అలా వీరి విజయానికి వీరి భార్యలందరూ కూడా పెద్ద ఎత్తున కృషి చేస్తున్నారు మరి వీరు అనుకున్న విధంగా ఫలితాలను వీరి భర్తలు అందుకుంటారా లేదా అన్నది మరికొద్ది రోజులలో తెలియనుంది.