Actress: అద్దె ఇంట్లో ఒంటరిగా బతుకుతోన్న ఆ నటి..కన్నీళ్లు తెప్పిస్తున్న ఆమె గాథ

Actress: కొత్త నీరు వచ్చి పాత నీటిని పంపినట్టుగా సినీ ఇండస్ట్రీలో కూడా పాత నటీనటులు కనుమరుగవుతూ ఉన్నారు. ఆనాడు వందల సినిమాల్లో నటించిన సెలబ్రిటీలు నేడు ఆర్థికంగా దిగజారి దీనస్థితిలో ఉన్నారు. కొందరేమో కాస్తో కూస్తో డబ్బులు వెనకేసుకుని బాగా సెటిల్ అయ్యారు. ఇంకొందరేమో ఆస్తులు పోగొొట్టుకుని అద్దె ఇళ్లలో గడుపుతున్నారు. కెరీర్ లో రాజభోగాలు అనుభవించి ఇప్పుడు అనాథలుగా బతుకుతున్నారు. అలాంటి వారి గురించి ప్రేక్షకులకు తెలీడం లేదు. అయితే అలాంటి వారిలో పావలా శ్యామల, జయకుమారి వంటివారు తమ జీవితాన్ని దుర్భరంగా లీడ్ చేస్తూ వస్తున్నారు.

 

 

తాజాగా దీన స్థితిలో బతుకుతున్న మరో నటి గురించి ఇప్పుడు సోషల్ మీడియాలో చర్చ మొదలైంది. సినీ కెరీర్ లో వందల సినిమాల్లో నటించడమే కాదు నిర్మాతగా మారి హిట్ సినిమాలను కూడా ఆమె తీశారు. అయినా ఆర్థికంగా చితికి పోయి ఇప్పుడు కడు పేదరికంలో బతుకుతున్నారు. ఆమె సీనియర్ నటి ఝాన్సీ. అప్పట్లో ఈమె ఎన్టీఆర్, ఏఎన్ఆర్ సినిమాల్లో కనిపించారు. ఇద్దరు కుమారులున్న ఈమె అనాథగా బతుకుతున్నానని చెప్పుకొచ్చారు.

 

పెద్ద కొడుకు బెంగళూరులో, చిన్న కొడుకు విజయవాడలో సెటిల్ అయినట్లు ఝాన్సీ చెప్పుకొచ్చారు. ప్రస్తుతం ఆమె వయసు 75కు పైనే అవుతోంది. ఈ వయసులో ఆమె అద్దె ఇంట్లో ఉంటూ ఒంటరిగా బతుకుతున్నారు. ఒకప్పుడు చెన్నైలో సొంత ఇంట్లో ఉండేవారని, ఇప్పుడు హైదరాబాద్ లో బతుకుతున్నట్లు తెలిపారు. సినిమాల్లో నష్టపోయి ఆస్తులు అమ్ముకుని హైదరాబాద్ కి వచ్చినట్లుగా వెల్లడించారు.

 

ప్రస్తుతం ఆమె హైదరాబాద్ లో అద్దె ఇంట్లో ఉన్నారని, నెల నెలా అద్దె కట్టుకోవడానికి కూడా డబ్బులు లేవని ఆవేదన వ్యక్తం చేశారు. 30 ఏళ్ల క్రితం తన భర్త చనిపోయారని, అప్పటి నుంచి తాను ఒంటరిగానే బతుకుతున్నట్లు తెలిపారు. పిల్లలు తనను పట్టించుకోకపోవడంతో ఒంటరినైపోయానని, సినిమాల్లో నష్టం వచ్చినప్పుడు కూడా తాను బాధపడలేదని, తన బిడ్డలు వదిలి ఒంటరిదాన్ని చేసినప్పుడే నిజమైన బాధ కలిగిందని ఝాన్సీ కన్నీటిపర్యంతమయ్యారు.

 

కొత్త నీరు వచ్చి పాత నీటిని పంపినట్టుగా సినీ ఇండస్ట్రీలో కూడా పాత నటీనటులు కనుమరుగవుతూ ఉన్నారు. ఆనాడు వందల సినిమాల్లో నటించిన సెలబ్రిటీలు నేడు ఆర్థికంగా దిగజారి దీనస్థితిలో ఉన్నారు. కొందరేమో కాస్తో కూస్తో డబ్బులు వెనకేసుకుని బాగా సెటిల్ అయ్యారు. ఇంకొందరేమో ఆస్తులు పోగొొట్టుకుని అద్దె ఇళ్లలో గడుపుతున్నారు. కెరీర్ లో రాజభోగాలు అనుభవించి ఇప్పుడు అనాథలుగా బతుకుతున్నారు. అలాంటి వారి గురించి ప్రేక్షకులకు తెలీడం లేదు. అయితే అలాంటి వారిలో పావలా శ్యామల, జయకుమారి వంటివారు తమ జీవితాన్ని దుర్భరంగా లీడ్ చేస్తూ వస్తున్నారు.

 

తాజాగా దీన స్థితిలో బతుకుతున్న మరో నటి గురించి ఇప్పుడు సోషల్ మీడియాలో చర్చ మొదలైంది. సినీ కెరీర్ లో వందల సినిమాల్లో నటించడమే కాదు నిర్మాతగా మారి హిట్ సినిమాలను కూడా ఆమె తీశారు. అయినా ఆర్థికంగా చితికి పోయి ఇప్పుడు కడు పేదరికంలో బతుకుతున్నారు. ఆమె సీనియర్ నటి ఝాన్సీ. అప్పట్లో ఈమె ఎన్టీఆర్, ఏఎన్ఆర్ సినిమాల్లో కనిపించారు. ఇద్దరు కుమారులున్న ఈమె అనాథగా బతుకుతున్నానని చెప్పుకొచ్చారు.

 

పెద్ద కొడుకు బెంగళూరులో, చిన్న కొడుకు విజయవాడలో సెటిల్ అయినట్లు ఝాన్సీ చెప్పుకొచ్చారు. ప్రస్తుతం ఆమె వయసు 75కు పైనే అవుతోంది. ఈ వయసులో ఆమె అద్దె ఇంట్లో ఉంటూ ఒంటరిగా బతుకుతున్నారు. ఒకప్పుడు చెన్నైలో సొంత ఇంట్లో ఉండేవారని, ఇప్పుడు హైదరాబాద్ లో బతుకుతున్నట్లు తెలిపారు. సినిమాల్లో నష్టపోయి ఆస్తులు అమ్ముకుని హైదరాబాద్ కి వచ్చినట్లుగా వెల్లడించారు.

 

ప్రస్తుతం ఆమె హైదరాబాద్ లో అద్దె ఇంట్లో ఉన్నారని, నెల నెలా అద్దె కట్టుకోవడానికి కూడా డబ్బులు లేవని ఆవేదన వ్యక్తం చేశారు. 30 ఏళ్ల క్రితం తన భర్త చనిపోయారని, అప్పటి నుంచి తాను ఒంటరిగానే బతుకుతున్నట్లు తెలిపారు. పిల్లలు తనను పట్టించుకోకపోవడంతో ఒంటరినైపోయానని, సినిమాల్లో నష్టం వచ్చినప్పుడు కూడా తాను బాధపడలేదని, తన బిడ్డలు వదిలి ఒంటరిదాన్ని చేసినప్పుడే నిజమైన బాధ కలిగిందని ఝాన్సీ కన్నీటిపర్యంతమయ్యారు.

 

Related Articles

ట్రేండింగ్

Chandrababu Naidu: చంద్రబాబు నాయుడు రెండో సంతకం ఆ ఫైలుపైనే.. ఆ యాక్ట్ ను రద్దు చేయనున్నారా?

Chandrababu Naidu: ఎన్నికల ప్రచారంలో భాగంగా చంద్రబాబు నాయుడు ప్రకాశం జిల్లాలోని చీరాలలో నిర్వహించిన ప్రజాగళం సభలో మాట్లాడారు. తాము అధికారంలోకి వస్తే చేయబోయే కార్యకలాపాల గురించి ఆ సభలో మాట్లాడారు. అధికారంలోకి...
- Advertisement -
- Advertisement -