Actress: బన్నీ ముసలోడు.. హీరోయిన్ గా చేయను.. ప్రముఖ నటి సంచలన వ్యాఖ్యలు!

Actress: పిల్లి కళ్ళ పాప కావ్య కళ్యాణ్ రామ్ గురించి మనందరికీ తెలిసిందే. కావ్య కళ్యాణ్ రామ్ అంటే చాలామంది గుర్తుపట్టకపోవచ్చు కానీ వల్లంకి పిట్ట వల్లంకి పిట్ట పాటలో నటించిన చిన్నారి అంటే చాలు అంటే గుర్తుపట్టిస్తారు. అయితే అది అప్పుడెప్పుడో గంగోత్రి సినిమా విడుదల అయిన సమయంలో. ప్రస్తుతం కావ్య కళ్యాణాన్ని చూశారు అంటే ఈమె ఆ పాప ఇద్దరు ఒకటేనా అన్న ఆశ్చర్యం వేయకమానదు. మొదటి చైల్డ్ ఆర్టిస్టుగా సినిమా ఇండస్ట్రీకి ఎంట్రీ ఈ చిన్న కావ్య కళ్యాణ్ రామ్ మసూద సినిమాతో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చిన విషయం తెలిసిందే.

ఇక బలగం సినిమాతో మరింత గుర్తింపు తెచ్చుకుంది ఈ భామ. కాగా బలగం సినిమా తర్వాత ఈ ముద్దుగుమ్మకు అవకాశాలు వరుసగా క్యూ కట్టాయి. ఒకవైపు సినిమాలలో నటిస్తూనే మరొకవైపు సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ వరుసగా హాట్ ఫోటో షూట్లతో యువతకు పిచ్చెక్కిస్తోంది. ఇది ఇలా ఉంటే తాజాగా కావ్యా కళ్యాణ్ రామ్ కి సంబంధించిన ఒక వార్త సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. అదేమిటంటే.. అల్లు అర్జున్ తో హీరోయిన్ గా చేసే అవకాశాన్ని వద్దు అనుకున్నదట. ఏంటి? నిజమా! ఏ సినిమాలో హీరోయిన్ గా అనుకున్నారు అని కంగారు పడకండి. అదంతా ఇప్పుడు కాదు తన చిన్నప్పుడు గంగోత్రి సినిమా సమయంలో. అప్పుడే బన్నీ పెద్దయ్యాక నా పక్కన హీరోయిన్ గా నటిస్తావా ? అంటే మరో మాట లేకుండా నో అని చెప్పిందట.

 

ఇదే విషయాన్ని ఇటీవల ఒక ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చింది కావ్య. ఈ సందర్భంగా కావ్య మాట్లాడుతూ.. గంగోత్రి సినిమాకు రాఘవేంద్రరావు గారు నా కళ్లు చూసి సెలెక్ట్ చేశారు. అప్పుడు సినిమా, షూటింగ్ ఇవేమి తెలిసేవి కాదు. ఆడుకోవడానికి సెట్ కు వెళ్లేదాన్ని, చాక్లెట్ ఇచ్చేవారు వాళ్లు చెప్పింది చేసేదాన్ని. ఇక సెట్ లో షాట్ అవ్వగానే బన్నీ నాతో ఆడుకొనేవారు. అలా ఒకసారి పెద్దయ్యాక నా పక్కన హీరోయిన్ గా చేస్తావా అని అడిగాడు. అందుకు నేను అప్పటికీ మీరు ముసలి వాళ్ళు అయిపోతారు. నేను హీరోయిన్ గా చేయను అని చెప్పాను. ఇప్పుడు నేను పెద్దదాన్ని అయ్యాను. కానీ, బన్నీ మాత్రం అలాగే ఉన్నాడు అంటూ నవ్వేసింది.

Related Articles

ట్రేండింగ్

CM Jagan: కూటమి విజయాన్ని ఫిక్స్ చేసిన జగన్.. మేనిఫెస్టో హామీలతో బొక్కా బోర్లా పడ్డారా?

CM Jagan: త్వరలోనే అసెంబ్లీ ఎన్నికలు జరగబోతున్నటువంటి తరుణంలో పెద్ద ఎత్తున ప్రచార కార్యక్రమాలలో నిర్వహిస్తున్నారు. అయితే వైసిపి అధినేత జగన్మోహన్ రెడ్డి వై నాట్ 175 అంటూ ప్రచార కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు....
- Advertisement -
- Advertisement -