Balayya: బాలయ్య తొలిసారి ఆ పవర్‌ను చూపించబోతున్నారా?

Balayya: ‘అఖండ’ సినిమాతో బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్న బాలయ్య.. వరుస ప్రాజెక్టులతో దూసుకెళ్తున్నారు. మాస్ సినిమాలు తీస్తూ.. తన డైలాగులతో థియేటర్లు దద్దరిల్లిపోయేలా చేస్తున్నాడు. సినిమాలతోపాటు వ్యాఖ్యతగానూ మరింతగా క్రేజ్ సంపాదించుకున్నారు. అప్పటివరకు బాలయ్యలో ఒక్క యాంగిల్ మాత్రమే చూసిన ఫ్యాన్స్.. అన్‌స్టాపబుల్ షోలో రకరకాల యాంగిల్స్ చూశారు. బాలయ్యలో సీరియస్ యాంగిల్ చూసిన ఫ్యాన్స్.. అల్లరి, చిలిపి చేష్టలు చూసి అభిమానులు షాకవుతున్నారు. చిన్న పిల్లలు సైతం బాలయ్యకు ఫ్యాన్స్ అవుతున్నారు.

 

 

ప్రస్తుతం బాలయ్య హీరోగా నటిస్తున్న సినిమా ‘వీరసింహారెడ్డి’. రాయలసీమ బ్యాక్‌డ్రాప్‌లో తెరకెక్కిస్తున్న ఈ సినిమాలో బాలయ్య డ్యూయల్ రోల్‌లో నటిస్తున్నారు. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమా సంక్రాంతి కానుకగా రిలీజ్ కానుంది. ఈ సినిమాను డిసెంబర్‌లో విడుదల చేయాలని నిర్మాతలు అనుకున్నారు. కానీ బాలయ్య కెరీర్‌లో సంక్రాంతికి విడుదలైన సినిమాలెన్నో మంచి సక్సెస్ అందుకున్నాయి. దాంతో సంక్రాంతికి ‘వీరసింహారెడ్డి’ సినిమాను రిలీజ్ చేయనున్నారు. బాలయ్య కెరీర్‌లోనే సమరసింహారెడ్డి, నరసింహ నాయుడు ఏ స్థాయి హిట్‌ అందుకున్న విషయం తెలిసిందే. వీరసింహారెడ్డి సినిమా కూడా ఆ రేంజ్‌లో ఉండబోతున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఈ రెండు సినిమాలు బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్నారు. ఈ తరహాలోనే మూవీ ఉండనుందని అభిమానులకు తెలియడంతో.. ఈసారి ‘వీరసింహారెడ్డి’ హిట్ కన్‌ఫర్మ్ అని భావిస్తున్నారు.

 

అయితే ఈ సినిమాకు సంబంధించి క్రేజీ అప్‌డేట్ వచ్చింది. ‘వీరసింహారెడ్డి’లో బాలయ్య రెండు రోల్స్ లో కనిపించనున్నాడట. విలేజ్ బ్యాక్‌డ్రాప్‌ క్యారెక్టర్‌లో వీరసింహారెడ్డి, యూఎస్ రిటర్న్ రోల్‌లో బాలసింహారెడ్డి కనిపించనున్నారు. తండ్రీకొడుకల చుట్టూ సినిమా స్టోరీ ముందుకు సాగుతుందని సమాచారం. వీరసింహారెడ్డి పాత్ర చనిపోయినప్పుడు యూఎస్ నుంచి వచ్చిన వాడు ఫ్యాక్షన్ రాజకీయాల్లో ఎలా అడుగు వేస్తాడు? తనతో విరోధం పెట్టుకున్న వారికి ఎలా బుద్ధి చెబుతాడు? అనే కోణంలో సినిమా స్టోరీ రన్ అవుతుంది. ఈ క్రేజీ అప్‌డేట్ తెలుసుకున్న ఫ్యాన్ తెగ సంబరపడిపోతున్నారు.

 

Related Articles

ట్రేండింగ్

CM Jagan: కూటమి విజయాన్ని ఫిక్స్ చేసిన జగన్.. మేనిఫెస్టో హామీలతో బొక్కా బోర్లా పడ్డారా?

CM Jagan: త్వరలోనే అసెంబ్లీ ఎన్నికలు జరగబోతున్నటువంటి తరుణంలో పెద్ద ఎత్తున ప్రచార కార్యక్రమాలలో నిర్వహిస్తున్నారు. అయితే వైసిపి అధినేత జగన్మోహన్ రెడ్డి వై నాట్ 175 అంటూ ప్రచార కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు....
- Advertisement -
- Advertisement -