NTR: ఎన్టీఆర్ విషయంలో సమంత ఇంత కఠినంగా వ్యవహరించిందా?

NTR: సోషల్ మీడియాలో ఇప్పుడు ఎక్కువగా సమంత పేరు వినిపిస్తోంది. రోజూ ఆమె గురించి ఏదోక వార్త నెట్టింట సందడి చేస్తుంటుంది. స్టార్ హీరోయిన్ గా సమంత సెటిల్ అయిన తర్వాత ఎవరూ ఊహించని విధంగా ఆమె అరుదైన వ్యాధి మరోసైటిస్ జబ్బుతో బాధపడుతున్నట్లు తెలిపారు. దీంతో ఫ్యాన్స్ కూడా చాలా కంగారు పడ్డారు. ఎప్పటికప్పుడు తన సినిమాకు సంబంధించిన క్రేజీ అప్డేట్స్ తో సోషల్ మీడియాలో యాక్టీవ్ గా ఉండే సమంత ప్రస్తుతం వాటికి దూరంగా ఉన్నారు. ప్రస్తుతం ఆమె దక్షిణ కొరియాలో మయోసైటిస్ అనే వ్యాధికి చికిత్స తీసుకుంటున్నారు.

 

తాజాగా సమంత ఇకపై సినిమాలు చేయదని గత కొన్ని రోజులుగా సోషల్ మీడియాలో వార్తలు వైరల్ అవుతున్నాయి. సమంత ప్రతినిధి ఆ వార్తలను ఖండిస్తూ వాటిని ఫేక్ న్యూస్ లని మీడియా ముఖంగా క్లారిటీ ఇచ్చారు. కానీ ఇదే టైంలో సమంతకు సంబంధించిన క్రేజీ రూమర్ మరొకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. కొరటాల శివ, ఎన్టీఆర్ డైరెక్షన్లో తెరకెక్కబోతున్న సినిమాలో మొదటగా హీరోయిన్ ను అలియా భట్ అని అనుకున్నారు. అయితే ఆమె బిడ్డకు జన్మనివ్వడం వల్ల ఆ సినిమా నుంచి తప్పుకున్నారు. ఆ తర్వాత సినిమాలో సమంతను హీరోయిన్ గా అనుకున్నారు.

 

గతంలో కూడా వీరిద్దరి పెయిర్ బావుందనే టాక్ వినిపిస్తోంది. అయితే ఎన్టీఆర్ తన 30వ సినిమాలో సమంతనే హీరోయిన్ అయితే అంతా బావుంటుందని అనుకున్నారు. కానీ ఈ సినిమాను సమంత రిజెక్ట్ చేసింది. ఈ విషయం తారక్ కు తెలియగానే కాల్ చేసి మాట్లాడరట. అయితే సమంత మాత్రం తన జబ్బు గురించి తెలియజేయకుండా సినిమా చేయలేనని తెలిపింది.

 

దీంతో తనకు లైఫ్ ఇచ్చిన ఎన్టీఆర్ ను సైతం సమంత రిజెక్ట్ చేసిందని చాలా వార్తలు వచ్చాయి. తీరా ఆమె జబ్బు గురించి తెలిశాక తారక్ ఆమెకు పర్సనల్ గా కాల్ చేసి మాట్లాడారట. అప్పుడప్పుడు ఆమెకు ఫోన్ చేసి ఆమె హెల్త్ గురించి ఆరా తీస్తున్నాడట. ఏది ఏమైనా ఈ క్యూట్ జంట మరోసారి తెరపై కనిపించాలని నెటిజన్స్ కోరుతున్నారు.

Related Articles

ట్రేండింగ్

Andhra Pradesh Assembly Elections: గులకరాళ్లతో, పసుపు చీరలతో రాజకీయాలు.. ఏపీ పరిస్థితి ఇంత దారుణంగా ఉందా?

Andhra Pradesh Assembly Elections: మరొక రెండు వారాలలో ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలతో పాటు పార్లమెంట్ ఎన్నికలు కూడా జరగబోతున్నటువంటి నేపథ్యంలో రాజకీయ వేడి రాజుకుంది. ఈ విధంగా ఎన్నికల త్వరలో జరగబోతున్నటువంటి...
- Advertisement -
- Advertisement -