Kumari Aunty: కుమారి ఆంటీ వంటకాలు అంటే ఆ స్టార్ హీరోలకు సైతం ఇష్టమా?

Kumari Aunty: ఈ మధ్యకాలంలో ఓవర్ నైట్ స్టార్ అయిన కుమారి ఆంటీ యూట్యూబ్ లో వాళ్లకి ఇస్తున్న ఇంటర్వ్యూల ద్వారా పలు విషయాలు వెలుగులోకి వస్తున్నాయి.కుమారి ఆంటీ వంటకాలను యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ ఇష్టంగా తింటారట. ఎన్టీఆర్ డ్రైవర్ తన దగ్గర పార్సిల్ తీసుకు వెళ్తాడని ఆమె అన్నారు. ప్రముఖ కమెడియన్ ఆలీ డైరెక్ట్ గా వచ్చి తన దగ్గర వంటకాలను కొనుగోలు చేస్తారని చెప్పుకొచ్చారు.

 

అయితే నిజానికి చాలామంది సెలబ్రిటీలు ఆమె ఫుడ్ ని టేస్ట్ చేసిన వారే అయితే కొందరు సెలబ్రిటీల డ్రైవర్లు అని చెప్పి ఫుడ్ పార్సెల్స్ ని తీసుకుని వెళుతూ ఉంటారు. ఇక కుమారి ఆంటీ దగ్గరికి వచ్చింది జూనియర్ ఎన్టీఆర్ డ్రైవర్ అవునా కాదా అన్నది జూనియర్ ఎన్టీఆర్ స్పందించే వరకు ఆగాల్సిందే.

ఇక తాజాగా కుమారి ఆంటీ ఫుడ్ స్టాల్ కి సంబంధించిన గొడవ సర్దుమనగటంతో మళ్ళీ ఆమె ఫుడ్ బిజినెస్ ఒక కొలిక్కి వచ్చినట్లు అయింది. కుమారి ఆంటీ ఈ పొలిటికల్ కామెంట్లకు వీలైనంత దూరంగా ఉండాలని నెటిజన్స్ కామెంట్స్ వ్యక్తం చేస్తున్నారు. ఈమె బిగ్ బాస్ షో కి ఎంట్రీ ఇస్తారని ప్రచారం జరుగుతూ ఉండగా అందులో నిజా నిజాలు మాత్రం ఇంకా తెలియాల్సి ఉంది.

 

కుమారి ఆంటీ కి సంబంధించిన కొన్ని నెగటివ్ వీడియోలు వైరల్ అవుతున్నా ఎక్కువ మంది ఆమె గురించి పాజిటివ్ గా స్పందిస్తున్నారు. 14 సంవత్సరాల నుంచి ఆమె ఫుడ్ స్టాల్ నడుపుతూ ఉండగా ఇప్పుడు ఆమెకు ఊహించని స్థాయిలో గుర్తింపు దక్కింది. ఈ మేరకు ఆమె రేట్లు కొద్దిగా మోతాదులో పెంచిన బిజినెస్ మాత్రం తగ్గే పరిస్థితి లేదు ఈమెకి రోజుకి 10,000 రూపాయల వరకు లాభం వస్తుంది. మౌత్ పబ్లిసిటీ తోనే కుమారి అంటే లక్షల్లో ఆదాయాన్ని సొంతం చేసుకుంటూ ఉండడం గమనార్హం.

Related Articles

ట్రేండింగ్

Union Minister Piyush Goyal: వైఎస్సార్ ను సైతం ముంచేసిన సీఎం జగన్.. ఆ కేసులో కావాలనే ఇరికించారా?

Union Minister Piyush Goyal: వైయస్సార్ కాలనీ పట్ల కేంద్రమంత్రి పియూష్ గోయెల్ తన ఆవేదన వ్యక్తం చేశారు. విజయవాడలో పీయూష్ గోయల్ విలేకరులతో మాట్లాడుతూ జగన్ పాలనపట్ల విరుచుకుపడ్డారు. వైయస్సార్ కాంగ్రెస్...
- Advertisement -
- Advertisement -