Mahesh: మహేష్ ఫ్యామిలీలో మరణాలకు ఆ దోషాలే కారణమా?

Mahesh: సూపర్ స్టార్ మహేష్ బాబు వరుస సినిమాలతో దూసుకుపోతున్నారు. సినీ కెరీర్ పరంగా ఆయనకు ఇప్పుడు ఎలాంటి ఇబ్బంది లేదు. అయితే వ్యక్తిగత జీవితంలో మాత్రం ఆయన వరుస విషాదాలను ఎదుర్కొంటున్నారు. మహేష్ బాబు కుటుంబంలో వరుస మరణాల గురించి ప్రముఖ జ్యోతిష్కుడు వేణుస్వామి షాకింగ్ వివరాలను తెలియజేశారు. జాతకంలో ఉండే దోషాల వల్లే ఆ కుటుంబంలో వరుస మరణాలు సంభవించినట్లు వేణు స్వాతి తెలిపారు.

 

 

2017 సంవత్సరం వరకు మహేష్ బాబు కుటుంబంలో ఏ పూజలైనా తానే చేశారని వేణు స్వామి తెలిపారు. 2017వ సంవత్సరంలో వాళ్ల కుటుంబంలో తాను వినాయక చవితి పూజలు చేశానని, ఆ టైంలో విజయనిర్మల జాతకం చూడాలని అడిగితే 2020 తర్వాత కుటుంబంలో వరుష మరణాలు ఉంటాయని ఆయన ఆ రోజే తెలిపానని వెల్లడించారు.

 

తాను ఆ విధంగా మొహం మీదే చెప్పటం వల్ల ఆ రోజు నుంచి ఇప్పటిదాకా వాళ్లింట్లో ఏ పూజా కార్యక్రమాలకైనా తనను దూరంగా పెట్టారని వేణు స్వాతి తెలిపారు. సీనియర్ నరేష్ కూడా తనను అప్పుడు అలా ఎందుకు చేశారంటూ కోప్పడ్డారని తెలిపారు. అలా జాతకం చెప్పడం వల్లే విజయ నిర్మల భయాందోళనకు గురవుతున్నారని నరేశ్ కోప్పడినట్లు తెలిపారు.

 

మహేష్ బాబు జాతకంలో గురు, శని గ్రహాలలో చోటు చేసుకుంటున్న మార్పులు సైతం తల్లీదండ్రులపై ప్రభావం చూపించాయని, మహేష్ ది సింహరాశి అని ఆ ఎఫెక్ట్ వల్ల కూడా ఈ విధంగా జరిగిందని వేణు స్వామి వెల్లడించారు. చాలా మందికి వేణు స్వామి జాతకాలు చెప్పారు. ఆయన చెప్పినవన్నీ జరిగాయి కూడా. అందుకే వేణు స్వామి చెప్పినవి నమ్మవచ్చని పలువురు భావిస్తుంటారు. ఇకపోతే మహేష్ సినిమాల విషయానికి వస్తే ఆయన వచ్చే ఏడాది త్రివిక్రమ్, రాజమౌళి డైరెక్షన్ లో సినిమాలు తీయనున్నారు.

Related Articles

ట్రేండింగ్

Chandrababu Naidu: చంద్రబాబు నాయుడు రెండో సంతకం ఆ ఫైలుపైనే.. ఆ యాక్ట్ ను రద్దు చేయనున్నారా?

Chandrababu Naidu: ఎన్నికల ప్రచారంలో భాగంగా చంద్రబాబు నాయుడు ప్రకాశం జిల్లాలోని చీరాలలో నిర్వహించిన ప్రజాగళం సభలో మాట్లాడారు. తాము అధికారంలోకి వస్తే చేయబోయే కార్యకలాపాల గురించి ఆ సభలో మాట్లాడారు. అధికారంలోకి...
- Advertisement -
- Advertisement -