Pavitra-Naresh: పవిత్ర నరేష్ పెళ్లి వెనుక అసలు కథ ఇదేనా?

Pavitra-Naresh: టాలీవుడ్ లో ఎంతో మంచి పేరున్న హీరో సూపర్ స్టార్ మహేష్ బాబు. తెలుగు సినిమా ఇండస్ట్రీలో మంచి గుర్తింపును సాధించి, ఘట్టమనేని కుటుంబం పేరును ఇండస్ట్రీలో నిలబెట్టిన హీరో కృష్ణ తనయుడిగా మహేష్ బాబు.. తండ్రిని మించిపోవడం తెలిసిందే. అయితే కృష్ణ అనారోగ్య కారణంగా మరణించగా.. అంత్యక్రియల సమయంలో విజయ నిర్మల కొడుకు నరేష్ చేసిన కొన్ని పనులు అందరినీ ఆశ్చర్యపరిచాయి.

 

విజయ నిర్మల మొదటి భర్త కొడుకు అయిన నరేష్.. కృష్ణను విజయ నిర్మల పెళ్లి చేసుకున్న తర్వాత వారి వద్దే ఉంటున్నాడు. అయితే విజయ నిర్మల మరణం తర్వాత నరేష్ అనుబంధం కృష్ణతో కొనసాగగా.. ఆయన కూడా హఠాత్తుగా మరణించడం తెలిసిందే. అయితే కృష్ణ, ఇందిరా దేవిల కొడుకైన మహేష్ బాబుకు తీరని దు:ఖం మిగలగా.. కృష్ణ అంత్యక్రియల్లో నరేష్ చేసిన అతి అందరికీ కోపం తెప్పించింది.

 

కృష్ణ అంత్యక్రియల్లో మేకప్ వేసుకొని, కూలింగ్ గ్లాసులు పెట్టుకొని, పవిత్రా లోకేష్ తో కలిసి అతిగా ప్రవర్తించడం ఇండస్ట్రీలోని వారికే కాదు, అంత్యక్రియాలకు హాజరైన ఇతర ప్రముఖులకు కూడా అనిపించింది. అయితే నరేష్ చేసిన అతి మహేష్ బాబుకు కూడా కోపం తెప్పించిందట. అందుకే నరేష్ ను పిలిచి, అందరిలో ఇలాంటి పనులు చేయడం ఏం సభ్యత కాదని చెబుతూనే, పవిత్రా లోకేష్ తో చనువుగా ఉండటం కాదు.. పెళ్లి చేసుకోవాలని సలహా ఇచ్చాడట.

 

దీంతో నరేష్ మహేష్ బాబు ఇచ్చిన సలహా మీద సీరియస్ గా ఆలోచించి.. చివరకు పవిత్రా లోకేష్ ను పెళ్లి చేసుకోవాలనే నిర్ణయానికి వచ్చాడట. మహేష్ బాబు చెప్పిన దాంట్లో తప్పు లేదని, ముందు నుండి ఇద్దరు కలిసి ఉండాలనే ఆలోచనలో ఉన్న నేపథ్యంలో పెళ్లి చేసుకోవాలని అనుకున్నారట. మొత్తానికి కొత్త ఏడాదిలో నరేష్-పవిత్రలు పెళ్లి చేసుకోబోతున్నట్లు ప్రకటించడం తెలిసిందే.

Related Articles

ట్రేండింగ్

Chandrababu Naidu: చంద్రబాబు నాయుడు రెండో సంతకం ఆ ఫైలుపైనే.. ఆ యాక్ట్ ను రద్దు చేయనున్నారా?

Chandrababu Naidu: ఎన్నికల ప్రచారంలో భాగంగా చంద్రబాబు నాయుడు ప్రకాశం జిల్లాలోని చీరాలలో నిర్వహించిన ప్రజాగళం సభలో మాట్లాడారు. తాము అధికారంలోకి వస్తే చేయబోయే కార్యకలాపాల గురించి ఆ సభలో మాట్లాడారు. అధికారంలోకి...
- Advertisement -
- Advertisement -