Shakalaka Shankar: వైరల్ అవుతున్న షకలక శంకర్ షాకింగ్ కామెంట్స్!

Shakalaka Shankar: తెలుగు సినిమా ఈవెంట్లు అభిమానుల్లో కొత్త ఉత్సాహాన్ని నింపుతూ ఉంటాయి. తాజాగా మెగాస్టార్ చిరంజీవి ‘వాల్తేరు వీరయ్య’ యూనిట్ భారీ ఈవెంట్ నిర్వహించగా.. మాస్ మహారాజ రవితేజ ‘ధమాకా’ సినిమా యూనిట్ కూడా రీసెంట్ గా ఈవెంట్ నిర్వహించింది. అయితే అందులో నిర్మాత, నటుడు బండ్ల గణేష్ మాట్లాడిన మాటలు ఎంతలా పాపులర్ అయ్యాయో అందరికీ తెలిసిందే.

 

అయితే అదే స్టేజ్ మీద మాట్లాడిన కమెడియన్ షకలక శంకర్ మాటలు.. ఇప్పుడు వివాదానికి కారణమయ్యాయి. షకలక శంకర్ మాటల మీద ఫైర్ అయిన మాస్ మహారాజ ఫ్యాన్స్.. రవితేజకు వెంటనే సారీ చెప్పాల్సిందే అంటూ ఏకంగా సోషల్ మీడియాలో హ్యాష్ ట్యాగ్ కూడా ట్రెండ్ అయ్యేలా చేశారు. దీంతో షకలక శంకర్ ఈ విషయం మీద స్పందించి.. రవితేజ ఫ్యాన్స్ ని శాంతపరిచాడు.

 

నిర్మాత బండ్ల గణేష్ ‘ధమాకా’ ఈవెంట్ లో మాట్లాడుతూ.. ఈమధ్య కొంతమంది నటులు రెండు, మూడేళ్లకే సూపర్ స్టార్, మెగాస్టార్ లో అయిపోతున్నారని అంటూ, రవితేజ అలా కాదు అని, చాలా కష్టపడి పైకి వచ్చాడని చెప్పాడు. దీనికి కౌంటర్ గా షకలక శంకర్ మాట్లాడాడు. మెగాస్టార్, సూపర్ స్టార్ ఆలా వూరికే అయిపోరని, కష్ట పడితే అవుతారని అంటూ గట్టిగా కౌంటర్ ఇచ్చాడు. ఇంకా మాట్లాడుతూ. ‘ఎవడో హీరో నీ ముందు ఉంటే, నువ్వు వెనకా ముందూ చూసుకోకుండా, మైక్ నీ చేతిలో ఉందని, నీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడకు’ అని బండ్ల గణేష్ కి శంకర్ కౌంటర్ ఇచ్చాడు.

 

ఈ విషయం మీద రవితేజ ఫ్యాన్స్ ఫైర్ అవుతున్నారు. షకలక శంకర్ స్టేజ్ మీద ఆవేశంతో ‘ఎవడో’ అని ఏకవచనంతో సంభోదించడం మీద రవితేజ ఫ్యాన్స్ మండిపడుతున్నారు. దీంతో స్పందించిన షకలక శంకర్.. ‘నేను అలా ఫ్లో లో చెప్పేసాను, చిరంజీవిని ఎంత అభిమానిస్తానో రవితేజని కూడా అంతే అభిమానిస్తా’ అంటూ ఓ వీడియోను విడుదల చేశాడు. దీంతో రవితేజ ఫ్యాన్స్ శాంతించారు.

Related Articles

ట్రేండింగ్

Election Campaigns: ఎన్నికల వేళ గరిష్టంగా రోజుకు 5,000 రూపాయలు.. కూలీలకు పంట పండుతోందా?

Election Campaigns: ఆంధ్రప్రదేశ్ లో ప్రస్తుతం జరుగుతున్న ఎన్నికల ప్రచారం చూస్తుంటే ఇవి అత్యంత ఖరీదైనవి గా కనిపిస్తున్నాయి. ఎందుకంటే గతంలో ఎన్నికల సమయంలో పార్టీ నాయకుల మీద అభిమానంతో స్వచ్ఛందంగా జనాలు...
- Advertisement -
- Advertisement -