Nawada: విద్యాబుద్దులు నేర్పించాల్సిన గురువు.. విద్యార్థుల విడియోస్ తీసి అలా?

Nawada: ఇటీవల కాలంలో ఆడపిల్లలపై జరుగుతున్న అత్యాచారాలు మానసిక వేధింపులు హత్యలు ఎక్కువ అవుతున్నాయి. దాంతో చాలావరకు ఆడపిల్లలు ఇల్లు విడిచి బయటకు వెళ్లాలి అంటేనే భయపడాల్సిన పరిస్థితిలో నెలకొంటున్నాయి. ఆడపిల్లలకు సమాజంలోనే కాకుండా స్కూల్స్ లో కూడా రక్షణ కరువవుతోంది. విద్యాబుద్ధులు నేర్పించాల్సిన గురువులు గాడి తప్పి కామ బుద్ధితో విద్యార్థులను చూస్తూ వారిపై అత్యాచారాలకు ఒడిగడుతున్నారు. ఇప్పటికే ఇలాంటి ఘటనలు ఎన్నో చోటు చేసుకున్న విషయం తెలిసిందే. తాజాగా ఇలాంటి ఘటనే ఒకటి చోటు చేసుకుంది. పూర్తి వివరాల్లోకి వెళితే..

 

బీహార్ లోని నావాడ పరిధిలో మదర్సాలో ఒక వ్యక్తి ఉపాధ్యాయుడిగా పనిచేస్తున్నాడు. కొంతకాలం నుంచి అదే స్కూల్లో విద్యార్థులకు పాఠాలు నేర్పుతూ చదువు చెప్పుతో వచ్చాడు. అయితే ఆ టీచర్ బుద్ధి రాను రాను దారుణంగా మారిపోయింది. ఉపాధ్యాయుడి అసలు రూపం బయటపడింది. అందంగా ఉన్న బాలికలను వారికి తెలియకుండా అతని మొబైల్ ఫోన్లో అసభ్యకరంగా ఫోటోలు వీడియోలు తీసేవాడు. అనంతరం ఆ వీడియోలను అదే బాలికలకు చూపించి బ్లాక్ మెయిల్ చేసేవాడు. ఆ విషయం గురించి ఎవరికైనా చెబితే చంపేస్తానని బెదిరించేవాడు. తాజాగా ఎప్పటిలాగే ఒక బాలిక వీడియోలు తీసి ఆ బాలికకి చూపించి బ్లాక్ మెయిల్ చేశాడు.

ఆ వీడియోలను చూసిన బాలిక ఒకసారిగా షాక్ కు గురై ఏడుస్తూ ఇంటికి వెళ్లి తన తల్లిదండ్రులకు జరిగింది మొత్తం వివరించింది. దాంతో తగిలిపోయిన బాలిక తల్లిదండ్రులు స్థానికంగా ఉండే పోలీసులకు ఫిర్యాదు చేశారు. బాలిక తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితుడి పై పొక్సో చట్టం కింద కేసు నమోదు చేసి అదుపులోకి తీసుకున్నారు. అయితే అమాయకమైన విద్యార్థుల పట్ల ఆ విధంగా ప్రవర్తించిన ఆ కామాంధుడిని కఠినంగా శిక్షించాలి అని మిగతా విద్యార్థుల తల్లిదండ్రులు కూడా ఆరోపించారు.

Related Articles

ట్రేండింగ్

Chandrababu Naidu: చంద్రబాబు నాయుడు రెండో సంతకం ఆ ఫైలుపైనే.. ఆ యాక్ట్ ను రద్దు చేయనున్నారా?

Chandrababu Naidu: ఎన్నికల ప్రచారంలో భాగంగా చంద్రబాబు నాయుడు ప్రకాశం జిల్లాలోని చీరాలలో నిర్వహించిన ప్రజాగళం సభలో మాట్లాడారు. తాము అధికారంలోకి వస్తే చేయబోయే కార్యకలాపాల గురించి ఆ సభలో మాట్లాడారు. అధికారంలోకి...
- Advertisement -
- Advertisement -