Balayya: ఆ ఒక్క పనితో చరణ్, తారక్ ఫ్యాన్స్ కు బాలయ్య షాకిచ్చారా?

Balayya: సినిమా ఇండస్ట్రీకి చెందిన హీరోలందరూ తమ సినిమాల ద్వారా జనాలకు దగ్గర కావాలని చూస్తారు. మరీ ముఖ్యంగా మాస్ జనాలకు దగ్గర కావాలని రకరకాల ప్రయత్నాలు చేస్తుంటారు. చాలా తక్కువ మంది మాత్రమే మాస్ జనాలకు కనెక్ట్ అవుతుంటారు. ఇలాంటి తక్కువ మందిలో రవితేజ ఒకడు. మాస్ పల్స్ ను పట్టేసిన రవితేజ.. మాస్ మహరాజగా కొనసాగుతున్నాడు. అయితే మాస్ జనాలకు సంబంధించిన విషయంలో ఇప్పుడు ఫ్యాన్ వార్ నడుస్తోంది.

 

తెలుగు సినిమా ఇండస్ట్రీలో తనదైన గుర్తింపు తెచ్చుకొని, మాస్ కు మారుగా నిలిచిన నందమూరి బాలయ్య.. మరోసారి పూర్తి మాస్ అవతారంలో ‘వీరసింహారెడ్డి’గా రాబోతున్నాడు. అయితే ఈ సినిమా మీద భారీ అంచనాలు ఉండగా.. ఈ సినిమా టైటిల్ కింద వాడిన ట్యాగ్ లైన్ ఇప్పుడు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, యంగ్ టైగర్ ఎన్టీఆర్ ల మధ్య చిచ్చు పెట్టింది. అలాంటి లైన్ పెట్టుకోవడం ఏంటనే చర్చ ఫ్యాన్స్ లో మొదలైంది.

 

సంక్రాంతి బరిలో వస్తున్న బాలయ్య సినిమా ‘వీరసింహారెడ్డి’ టైటిల్ కింద ‘గాడ్ ఆఫ్ మాసెస్’ అనే ట్యాగ్ వాడారు. డైరెక్టర్ గోపిచంద్ మలినేని బాలయ్య ఫ్యాన్ కాగా.. మాస్ ని వేరే లెవల్ లో చూపించడంలో భాగంగా ఈ ట్యాగ్ ని వాడినట్లు తెలుస్తోంది. అయితే మాస్ జనాలకు చేరువైన హీరోల విషయంలో ఇప్పటికే మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, యంగ్ టైగర్ తారక్ ఫ్యాన్స్ మధ్య గొడవ సాగుతోంది.

 

సినిమా ఇండస్ట్రీలో మాస్ సినిమాలకు కేరాఫ్ ఎవరి అడిగితే ఎవరైనా తారక్ పేరు చెబుతారని అతడి ఫ్యాన్స్ అంటుంటే, మ్యాన్ ఆఫ్ మాసెస్ అని ఎవరిని అడిగినా రామ్ చరణ్ పేరు చెబుతారని అతడి ఫ్యాన్స్ అంటున్నారు. ఇలా ఈ ఇద్దరు ఫ్యాన్స్ మధ్య గొడవ జరుగుతున్న తరుణంలోనే బాలయ్య.. వీళ్లందరికీ చెక్ పెట్టేలా ‘గాడ్ ఆఫ్ మాసెస్’ అని పెట్టుకోవడంతో అందరూ షాక్ అయ్యారు.

Related Articles

ట్రేండింగ్

Chandrababu Naidu: చంద్రబాబు నాయుడు రెండో సంతకం ఆ ఫైలుపైనే.. ఆ యాక్ట్ ను రద్దు చేయనున్నారా?

Chandrababu Naidu: ఎన్నికల ప్రచారంలో భాగంగా చంద్రబాబు నాయుడు ప్రకాశం జిల్లాలోని చీరాలలో నిర్వహించిన ప్రజాగళం సభలో మాట్లాడారు. తాము అధికారంలోకి వస్తే చేయబోయే కార్యకలాపాల గురించి ఆ సభలో మాట్లాడారు. అధికారంలోకి...
- Advertisement -
- Advertisement -