భర్త శవంతో బిర్యానీ వండుకుని తింది!

ప్రస్తుత సమాజంలో మానస సంబంధాలకు విలువ లేకుండా పోతున్నాయి. శరీరక సుఖం కోసం ప్రాణాలు తీస్తున్నారు. భర్తను భార్యనో.. భార్యను భర్తనో రోజూ ఏదో ఓ చోటు ఇలాంటి ఘటనలు జరుగుతూనే ఉన్నాయి. తమ ³ంథాలను దగ్గించుకునేందుకు కుటుంబాలను రోడ్డను పడేస్తున్నారు. అగ్ని సాక్షిగా ఏడడుగులు వేసిన వాళ్లే పెళై ఏడు నెలలు గడకవ ముందే పాడెక్కిస్తున్నారు. అక్రమ సంబంధాలు, శరీరక సుఖమే ఇలాంటి ఘటనలకు కారణమవుతున్నాయి. తాజాగా అక్రమ సంబంధం పెట్టుకున్న భర్తను అతని భార్య అతి దారుణంగా హత్యచేసింది. అంతటితో ఆగకుండా భర్త శవాన్ని చిన్న చిన్న ముక్కలుగా చేసి బిర్యానీ వండుకుని తిన్న ఘటన ఇరాన్‌ దేశంలో చోటు చేసుకుంది. అక్కడి పోలీసులు హత్యకు దారి తీసిన వివరాలను వెల్లడించారు.

ఇరాన్‌ రాజధాని అయిన డెహ్రాన్‌లోని ఇస్లాంషహర్‌కు చెందిన ఓ దంపతులకు ఏడేళ్ల క్రితం వివాహం జరిగింది. పెళ్లి అయినప్పటి నుంచి సజావుగా సాగిన వారి కుటుంబంలో అక్రమ సంబంధంతో చిచ్చురేగింది. ప్రస్తుతం వారికి 5 సంవత్సరాల పాపా కూడా ఉంది. అ క్రమంలో తన భార్యకు తెలియకుండా భర్త పరాయి మహిళతో అక్రమ సంబంధం కొనసాగిస్తున్నారు. కొన్ని నెలలుగా భార్యకు అనుమానం రాకుండా చాలా జాగ్రత్తలు పడుతూ ఆ మహిళ ఇంటికి వెళ్తుండే వాడు. ఎలాగో భార్యకు తన భర్త మరో స్త్రీతో గడుపుతున్నట్లు తెలిసింది . దీంతో ఆమె భర్తతో గొడవపడుతూ నిలదీసింది. తరచూ భార్య అక్రమ సంబంధం గురించి తీసి గొడవ పడుతున్నప్పుడల్లా అతడు ఆమెతో పాటు తన ఐదేళ్ల పాపను కూడా విపరీతంగా కొట్టేవాడు. ఇలా కొన్ని నెలలు గడిచిపోయాయి. ఆ గొడవలు రోజు రోజుకు పెద్దదవుతూ వచ్చాయి.

ఓ రోజు ఇద్దరి మధ్య జరుగుతున్న గొడవలో కోపోద్రిక్తుడైన భర్త కత్తి తీసుకుని భార్య వద్దక వచ్చి బెదిరింపులకు దిగాడు. ముందు భర్తపై కోపంతో రగిలిపోయి ఉన్న ఆమె అతడ చేతిలో ఉన్న కత్తిని ఒక్కసారిగా గుంచుకుని క్షణం కూడా ఆలోచించకుండా భర్తను పొడిచి నరికేసింది. ఆ తర్వాత ఆ శవాన్ని ముక్కలు ముక్కలుగా చేసి బిర్యానీ చేసుకుని తినింది. గుర్తించిన స్థానికులు పోలీసులకు సమాచారం ఇవ్వడంతో ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు సగం కట్‌ చేసిన భర్త శవాన్ని స్వాధీనం చేసుకున్నారు. తన భర్తను తానే నరికి చంపి బిర్యానీ వండుకుని తిన్నట్లు ఆమె పోలీసుల విచారణలో పేర్కొంది.

Related Articles

ట్రేండింగ్

Chandrababu Naidu: చంద్రబాబు నాయుడు రెండో సంతకం ఆ ఫైలుపైనే.. ఆ యాక్ట్ ను రద్దు చేయనున్నారా?

Chandrababu Naidu: ఎన్నికల ప్రచారంలో భాగంగా చంద్రబాబు నాయుడు ప్రకాశం జిల్లాలోని చీరాలలో నిర్వహించిన ప్రజాగళం సభలో మాట్లాడారు. తాము అధికారంలోకి వస్తే చేయబోయే కార్యకలాపాల గురించి ఆ సభలో మాట్లాడారు. అధికారంలోకి...
- Advertisement -
- Advertisement -