Rashi Khanna: చరణ్, ఎన్టీఆర్ కంటే రాశిఖన్నాకే ఎక్కువ క్రేజ్ ఉందా?

Rashi Khanna: ఇప్పుడు ప్రతి ఇండస్ట్రీలు సర్వేలు నడుస్తున్నాయి. ఇది సర్వేల యుగం అని కూడా చెప్పుకోవచ్చు. రాజకీయాలు, సినీ ఇండస్ట్రీ, స్టాక్‌ మార్కెట్‌ ఇలా ఒక్కటేమిటి అన్నీ రంగాల్లో సర్వేల హవా కొనసాగుతోంది. తాజాగా సినీ ఇండస్ట్రీకి చెందిన ఓ సర్వే అందర్నీ విస్మయానికి గురి చేసింది. అది చూసిన జనాలు కూడా నమ్మలేకపోతున్నారు. కానీ నమ్మాల్సిన పరిస్థితి ఏర్పడింది.

 

పఠాన్‌ సినిమా ఏ రేంజ్‌లో పాజివిట్‌ టాక్‌ తెచ్చుకుందో అందరం చూశాం. మెుదట కాంట్రవర్సీలకు కేరాఫ్‌గా మారిన ఈ మూవీ రిలీజ్‌ తర్వాత ఆ నోళ్లన్నిటినీ మూత పెట్టేసింది. ఈ సినిమా కథలో సుమారు 75 శాతం హీరో షార్‌ ఖాన్‌ ఉన్నారు. మిగిలిన భాగం మాత్రమే ఇతర యాక్టర్లు ఉన్నారు. ఇదంతా పక్కకు పెడితే ఆ సినిమా అంతర్జాతీయ స్థాయిలో వందల కోట్ల వసూళ్లు చేసింది.

 

 

అయితే ఐఎండీబీ సర్వే తాజాగా సినిమాలు, వెబ్‌ సిరీస్‌లపై ఓ సర్వే చెపట్టింది. ఇందులో ఐఎండీబీ వీక్లీ ఇండియన్‌ పాపులర్‌ సెలబ్రిటీస్‌ అనే ఫీచర్‌ను ప్రవేశపెట్టింది. అందులో రాశిఖన్నా టాపర్‌గా వచ్చింది. షార్‌ఖాన్‌ మాత్రం రన్నరప్‌గానే నిలిచాడు. మూడో ప్లేస్‌లో విజయ్‌ సేతుపతి ఉన్నాడు. ఇక తెలుగు నుంచి ఏ యాక్టర్‌ టాప్‌ టెన్‌లో కనిపించలేదు. దీంతో అంతా షాక్‌కు గురి అవుతున్నారు. ఇదేం సర్వేరా నాయనా, ఆమెకు ఇంత క్రేజ్‌ ఉందా అని ముక్కును వేలు వేసుకుంటున్నారు. అలా ఉంటుంది మరీ రాశి ఖన్నా అంటే అని ఆమె ఫ్యాన్స్‌ అంటున్నారు.

Related Articles

ట్రేండింగ్

Chandrababu Naidu: చంద్రబాబు నాయుడు రెండో సంతకం ఆ ఫైలుపైనే.. ఆ యాక్ట్ ను రద్దు చేయనున్నారా?

Chandrababu Naidu: ఎన్నికల ప్రచారంలో భాగంగా చంద్రబాబు నాయుడు ప్రకాశం జిల్లాలోని చీరాలలో నిర్వహించిన ప్రజాగళం సభలో మాట్లాడారు. తాము అధికారంలోకి వస్తే చేయబోయే కార్యకలాపాల గురించి ఆ సభలో మాట్లాడారు. అధికారంలోకి...
- Advertisement -
- Advertisement -