Vishnupriya: విష్ణుప్రియది విశాల హృదయమా.. అందుకే ఈ విధంగా చేస్తోందా?

Vishnupriya: సోషల్ మీడియా వచ్చినప్పటి నుంచి తమ అందాలను ఆరబోస్తున్నారు యాక్టర్లు. ముఖ్యంగా హీరోయిన్లు ప్రత్యేకంగా డిజైన్ చేయించుకున్న డస్సులతో హాట్ హాట్ గా ఫోటోలు దిగుతున్నారు. వాటిని సోషల్ మీడియా వేదికగా పంచుతున్నారు. ఇటు బుల్లితెర యాంకర్లు కూడా తామేమి తక్కువేం కాదన్నట్టు, బోల్డ్ నెస్ తో ఫ్యాన్స్ ని అట్రాక్ట్ చేస్తున్నారు. యాంకరింగ్ ఎలా ఉన్నప్పటికీ.. రెగ్యులర్ గా సోషల్ మీడియాలో అందాల విందు మాత్రం గట్టిగానే చేస్తున్నారు. అలాంటి బోల్డ్ యాంకర్స్ లో విష్ణుప్రియ ఒకరు. ఈ బ్యూటీ గురించి ప్రేక్షకులకు ప్రత్యేక పరిచయం అక్కర్లేదు. ఎందుకంటే టీవీ షోలకు యాంకర్ గా కెరీర్ స్టార్ట్ చేసినప్పటికీ.. తనకంటూ స్పెషల్ క్రేజ్ వచ్చాక, బోల్డ్ గా తయారై టీవీ షోలకు దూరంగా ఉంటోంది. అంతేగాక అడపాదడపా సినిమాలు ఓకే చేస్తూ హీరోయిన్ గా బిగ్ స్క్రీన్ పై తనను తాను ప్రూవ్ చేసుకునే ప్రయత్నం చేస్తోంది.

 

ఈ నేపథ్యంలోనే కొన్నాళ్లుగా సినిమాలకు, టీవీ షోలకు దూరంగా ఉంటున్న విష్ణుప్రియ. తాజాగా ఫ్యాన్స్ తో ముచ్చటిస్తూ తన కెరీర్, బాయ్ ఫ్రెండ్స్, ఫస్ట్ కిస్ లాంటి విషయాలను బయట పెట్టేసింది. ఎప్పుడో ఓసారి టీవీ షోస్ లో మెరిసే విష్ణుప్రియ.. అప్పుడప్పుడు ఇన్ స్టాగ్రామ్ లో ఫ్యాన్స్ షాకయ్యే రేంజ్ లో బోల్డ్ ఫోటోలు పోస్ట్ చేస్తోంది. ఇటీవల నటుడు మానస్ తో కలిసి ప్రైవేట్ సాంగ్, స్టేజ్ పెర్ఫార్మన్స్ లు సైతం చేసి అలరించింది. అయితే ఈ అమ్ముడిని నెటిజన్లు పలు ప్రశ్నలు వేశారు.

ఇక విష్ణుప్రియ మాట్లాడుతూ.. నాకు పర్సనల్ లైఫ్, రెస్పాన్సిబిలిటీస్ ఉన్నాయి. నా లైఫ్ లో బాయ్ ఫ్రెండ్ లేక బాధపడుతున్నా. ఒకవేళ వాడున్నా నా టైమ్ అంతా వృథా అయిపోయేది. నేను రిలేషన్ షిప్ లో ఉన్నా లేకపోయినా ఒకేలా ఉంటాను. ఇప్పటిదాకా నేను బ్రేకప్ చెప్పిన బాయ్ ఫ్రెండ్స్ ని దూరం పెట్టకుండా.. ఇంకా వాళ్ళని ఫ్యామిలీగా చూసుకుంటాను. ఇక నా ఫస్ట్ ఆన్ స్క్రీన్ కిస్ 17 ఏళ్లకే జరిగింది. బిగ్ బాస్ షో విషయానికి వస్తే, తెలుగు షోపై నాకు ఇంటరెస్ట్ లేదు. కానీ హిందీ బిగ్ బాస్ లో అవకాశం వస్తే వెళ్తాను. ఎందుకంటే తెలుగులో బాగా ఆడేవాళ్లు కూడా ఓడిపోతుంటారంటూ చెప్పుకొచ్చింది. ప్రస్తుతం విష్ణుప్రియ కామెంట్స్ నెట్టింట వైరల్ గా మారాయి.

Related Articles

ట్రేండింగ్

Chandrababu Naidu: చంద్రబాబు నాయుడు రెండో సంతకం ఆ ఫైలుపైనే.. ఆ యాక్ట్ ను రద్దు చేయనున్నారా?

Chandrababu Naidu: ఎన్నికల ప్రచారంలో భాగంగా చంద్రబాబు నాయుడు ప్రకాశం జిల్లాలోని చీరాలలో నిర్వహించిన ప్రజాగళం సభలో మాట్లాడారు. తాము అధికారంలోకి వస్తే చేయబోయే కార్యకలాపాల గురించి ఆ సభలో మాట్లాడారు. అధికారంలోకి...
- Advertisement -
- Advertisement -