Raghu: వైరల్ అవుతున్న ప్రముఖ కమెడియన్ షాకింగ్ కామెంట్స్!

Raghu: పాన్ ఇండియా స్టార్ జూనియర్ ఎన్టీఆర్ ను అభిమానించని వారు ఇండస్ట్రీలో ఉండరు. ఎవర్ని పల్లెత్తు మాట అనని మనస్తత్వం ఆయనది. చిరునవ్వుతో అందరినీ పలుకరిస్తారు. ఆయనకు కోట్ల మంది ఫ్యాన్సు ఫాలోయింగ్ ఉంది. ఇక ఇండస్ట్రీలోనూ ఆయన కోసం ప్రాణం ఇచ్చేవారు ఉన్నారు. కమెడియన్ రఘుకు కూడా హీరో జూనియర్ ఎన్టీఆర్ అంటే ఎంతో ప్రేమ. ఈ విషయాన్ని రఘు ఎన్నోసార్లు చెప్పాడు. తాజా ఓ ఇంటర్వ్యూలో రఘు తారక్ కోసం ఏం చేయడానికైనా సిద్ధమని సంచలన వ్యాఖ్యలు చేశాడు.

 

కామెడీకి కేరాఫ్ అడ్రస్గా నిలిచేది తెలుగు చిత్రపరిశ్రమ. బ్రహ్మానందం, ధర్మవరపు సుబ్రహ్మణ్యం, ఎంఎస్ నారాయణ, సునీల్, అలీ, వేణుమాధవ్ లాంటి ఎందరో కమెడియన్లు తమ హాస్య ప్రతిభతో ప్రేక్షకులను కడుపుబ్బా నవ్వించేవారు. ఇప్పుడు కూడా కొత్తతరం కమెడియన్స్ పుట్టుకొస్తున్నారు. ఇదిలా ఉంటే కమెడియన్ రఘు కారుమంచి గుర్తుండే ఉంటాడు. 200కి పైగా సినిమాల్లో ఆయన నటించాడు. ఆది, అదుర్స్ లాంటి మూవీస్లో తనదైన మేనరిజమ్స్తో ఆకట్టుకున్నాడు రఘు.

వృత్తి సాఫ్ట్వేర్ అయినా ప్రవృత్తి మాత్రం సెటిల్మెంట్లు, దందాలు అని స్వయంగా రఘునే వెల్లడించాడు. కాలేజీ రోజుల నుంచి రౌడీయిజం చేసేవాడ్నని చెప్పిన రఘు.. తన స్నేహితుడైన జూనియర్ ఎన్టీఆర్ జోలికి ఎవరైనా వస్తే చంపడానికైనా, చావడానికైనా రెడీ అని సంచలన వ్యాఖ్యలు చేశాడు. ఎన్టీఆర్ కోసం ప్రాణాలు ఇవ్వడమే కాదు, తీయమన్నా తీసేస్తా. ఫలానా వ్యక్తి ఇలా అన్నాడని చెప్తే రేపటికల్లా ఆ ప్రాణం మిగలదు. దీంట్లో ఎలాంటి మొహమాటం లేదు. నేను పక్కా హైదరాబాదీ. ఎన్టీఆర్ నా బాడీలో ఒక పార్ట్‌లా మారిపోయారు అని రఘు పేర్కొన్నాడు. భవిష్యత్తులో ఎన్టీఆర్ పక్కా సీఎం అవుతారని ఆయన చెప్పుకొచ్చాడు.

Related Articles

ట్రేండింగ్

Chandrababu Naidu: చంద్రబాబు నాయుడు రెండో సంతకం ఆ ఫైలుపైనే.. ఆ యాక్ట్ ను రద్దు చేయనున్నారా?

Chandrababu Naidu: ఎన్నికల ప్రచారంలో భాగంగా చంద్రబాబు నాయుడు ప్రకాశం జిల్లాలోని చీరాలలో నిర్వహించిన ప్రజాగళం సభలో మాట్లాడారు. తాము అధికారంలోకి వస్తే చేయబోయే కార్యకలాపాల గురించి ఆ సభలో మాట్లాడారు. అధికారంలోకి...
- Advertisement -
- Advertisement -