ఇంటర్, ఎంబీబీఎస్ లలో చదువుపై ఒత్తిడి పెరుగోతోంది. మార్కుల కోసం తల్లిదండ్రులు, కాలేజ్ యాజమాన్యం ఒత్తిడి పెంచుతోంది. చదువుపై శ్రద్ధ పెట్టలేకపోతున్నానంటూ డిగ్రీ విద్యార్థిని ఒకరు ఈ మధ్య ఆత్మహత్య చేసుకుంది. ఈ విషాదకర సంఘటన హైదరాబాద్ బాలానగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. ఓల్డ్ విలేజ్లో నివాసం ఉంటున్న వన్నెల పావని బేగంపేట్లోని గర్ల్స్ డిగ్రీ ప్రభుత్వ కాలేజీలో బీకాం సెకండ్ ఇయర్ చదువుతుంది.గత కొంతకాలంగా చదువలేకపోతున్నాను అంటూ ఆలోచిస్తూ డిప్రెషన్లోకి వెళ్లింది. తాను చదువుపై శ్రద్ధ పెట్టలేనని భావించిన పావని, చావే పరిష్కారంగా నిర్ణయం తీసుకుంది. ఈ క్రమంలో ఇంట్లో ఎవరూ లేని సమయంలో తన గదిలోని ఫ్యాన్కు ఉరేసుకొని ఆత్మహత్య చేసుకుంది.
ప్రాణంగా పెంచుకున్న బిడ్డ ఇలా విగతజీవిగా వేలాడటం చూసి వారు గుండెలు బాదుకున్నారు. చదువొక్కటే జీవితం కాదు కదా తల్లి నువ్వు మా కళ్ల ముందు ఉంటే అదే పదివేలు. ఇంత దారుణం ఎలా చేయాలనిపించింది. ఊరేసుకునేముందు మేం గుర్తుకు రాలేదా తల్లి మాకేందుకు ఇంత కడుపుకోత మిగిల్చావ్ అంటూ గుండెలు పగిలేలా ఏడ్చారు. ఇక సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు ఘటన స్థలానికి చేరుకొని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వ హాస్పిటల్కి తరలించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.