Dhanush-Aishwarya: ధనుష్ ఐశ్వర్య కోర్టు మెట్లు ఎక్కడం వెనుక బిగ్ ట్విస్ట్ ఏంటంటే?

Dhanush-Aishwarya: కొలీవుడ్ స్టార్ హీరో ధనుష్ గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. నటన పరంగా ప్రతి ఒక్కరిని ఫిదా చేసి అభిమానులను మార్చుకున్నాడు. తెలుగు ప్రేక్షకులను కూడా అభిమానులగా మార్చుకున్నాడు. ఇక రీసెంట్ గా విడుదలైన సార్ మూవీతో మరింత హిట్ సొంతం చేసుకున్నాడు. అయితే ఇదంతా పక్కన పెడితే.. తాజాగా ఈయన మరోసారి కోర్టు మెట్లు ఎక్కినట్లు తెలిసింది.

ఇంతకూ అసలు విషయం ఏంటంటే.. ధనుష్.. రజినీకాంత్ కూతురు ఐశ్వర్య ను పెళ్లి చేసుకున్న సంగతి తెలిసిందే. ఇక వీరికి ఇద్దరు పిల్లలు ఉన్నారు. అయితే ఆ మధ్యనే తాము విడిపోతున్నామని ధనుష్ సోషల్ మీడియా వేదికగా తెలిపి అందరికి షాక్ ఇచ్చాడు. ఆ సమయంలో తమ అభిమానులు బాగా షాక్ అయ్యారు.

 

అయితే కొన్ని రోజుల కిందట రజినీకాంత్ సలహాతో ధనుష్, ఐశ్వర్య వీరి విడాకులను రద్దు చేసుకున్నారని తెలిసింది. పిల్లల కోసమైనా తాము కలిసి ఉండాలని అనుకున్నట్లు తెలిసింది. అయితే తాజాగా వీరు మరోసారి కోర్టు మెట్లు ఎక్కారని తెలిసింది. చెన్నైలోని సిటీ సివిల్‌ కోర్ట్ కి ఈ ఇద్దరు విడాకుల కోసం అప్లికేషన్‌ పెట్టుకున్నారని తెలిసింది. ధనుష్‌ మరో అమ్మాయి కోసం ఐశ్వర్య రజనీకాంత్‌ తో విడిపోవాలనుకుంటున్నట్టు తెలిసింది.

 

ఇక ఈ విషయాన్ని వివాదస్పద ఒవర్సీస్‌ క్రిటిక్‌ ఉమైర్‌ సంధు తాజాగా ట్వీట్‌ చేసాడు. ధనుష్ వేరే అమ్మాయి కోసం ఐశ్వర్య ను చీట్ చేశాడని ఈ జంట మరోసారి విడాకుల కోసం కోర్టు మెట్లు ఎక్కారని షాకింగ్ ట్వీట్ చేసాడు. దీంతో ఆయన చేసిన కామెంట్స్ ప్రస్తుతం బాగా వైరల్ అవుతున్నాయి. ఇక ఈయన చేసిన కామెంట్స్ చూసి నెటిజన్స్ బాగా ఫైర్ అవుతున్నారు. ఎందుకంటే ఈయన ఎప్పుడు ఇటువంటి కామెంట్సే చేస్తుంటాడు కాబట్టి.

Related Articles

ట్రేండింగ్

Chandrababu Naidu: చంద్రబాబు నాయుడు రెండో సంతకం ఆ ఫైలుపైనే.. ఆ యాక్ట్ ను రద్దు చేయనున్నారా?

Chandrababu Naidu: ఎన్నికల ప్రచారంలో భాగంగా చంద్రబాబు నాయుడు ప్రకాశం జిల్లాలోని చీరాలలో నిర్వహించిన ప్రజాగళం సభలో మాట్లాడారు. తాము అధికారంలోకి వస్తే చేయబోయే కార్యకలాపాల గురించి ఆ సభలో మాట్లాడారు. అధికారంలోకి...
- Advertisement -
- Advertisement -