Rinku Singh: కోల్కత్తా నైట్ రైడర్స్ బ్యాటర్ రింకూ సింగ్ గురించే ప్రస్తుతం చర్చ జరుగుతోంది. క్రికెట్ అభిమానుల్లోనూ, మీడియాలోనూ అతడు హాట్టాపిక్గా మారాడు. ఆదివారం గుజరాత్ టైటాన్స్తో జరిగిన మ్యాచ్లో రింకూ సింగ్ 20వ ఓవర్లో లాస్ట్ 5 బాల్స్కు వరుసగా ఐదు సిక్స్లు కొట్టాడు. దీంతో ఉత్కంఠ పోరుతో కోల్కత్తా నైట్ రైడర్స్ విజయం సాధించింది. దీంతో ప్రస్తుతం రింకూ సింగ్ పేరు సోషల్ మీడియాలో మారుమ్రోగిపోతుంది. చివరి 5 బాల్స్కు ఐదు సిక్స్లు కొట్టిన క్రికెటర్గా రికార్డు సృష్టించాడు.
ఐపీఎల్ చరిత్రలో రింకూ సింగ్ చిరస్థాయిగా నిలిచిపోయాడు. ఈ ఘనత సాధించిన అనంతరం రింకూ సింగ్ మాట్లాడుతూ.. తనకు మద్దతుగా నిలిచిన వారందరికీ ధన్యవాదాలు తెలిపాడు. ఈ సిక్స్లను తనకు మద్దుగా నిలిచిన ప్రతిఒక్కరికీ అంకితం చేస్తున్నట్లు చెప్పాడు. ఈ సందర్భంగా తన కుటుంబ విషయాలు, జీవితంలో తన కష్టాలను బయటపెట్టాడు. కుటుంబం కోసం మా నాన్న చాలా కష్టపడ్డాడని, తమది వ్యవసాయ కుటుంబమని చెప్పుకొచ్చాడు. తండ్రి చిన్న చిన్న పనులు చేసి తమ కుటుంబాన్ని పోషించారని, తన కోసం త్యాగాలు చేసిన ప్రతిఒక్కరికీ తన సిక్స్లను అంకితం చేస్తున్నట్లు చెప్పుకొచ్చాడు.
తొలి నాలుగు సిక్స్లు ఒక ఎత్తు అయితే చివరి సిక్స్ మరొక ఎత్తు అని రింకూ సింగ్ చెప్పాడు. చివరి సిక్స్ను బ్యాక్ఫుట్ మీద కొట్టేందుకు చాలా కష్టపడాల్సి వచ్చిందని రింకూ సింగ్ చెప్పాడు. అయితే ఐదు సిక్స్లతో పాపులర్ అయిన రింకూ సింగ్ను కోల్కతా రెగ్యులర్ కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ వీడియో కాల్ చేసి అభినందించాడు. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్గా మారింది.ఈ వీడియోను కోల్కతా నైట్ రైడర్స్ జట్టు తన అధికారిక ట్విట్టర్ అకౌంట్లో పెస్ట్ చేసింది.