Virupaksha: మెగా హీరో సాయిధరమ్ తేజ్ రోడ్డు ప్రమాదానికి గురైన తర్వాత తిరిగి కోలుకొని మొదటిసారి విరూపాక్ష సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చారు. ఈ సినిమా నేడు ఎన్నో అంచనాల నడుమ ప్రేక్షకుల ముందుకు వచ్చింది. కార్తీక్ దండు దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాలో సాయిధరమ్ తేజ్ సంయుక్త మీనన్ హీరో హీరోయిన్లుగా నటించారు. బ్రహ్మాజీ, సాయి చంద్, రాజీవ్ కనకాల, సునీల్, అభినవ్ గౌతమ్, అజయ్ తదితరులు ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు.
ఒక సస్పెన్స్ థ్రిల్లర్ గా తెరికెక్కిన ఈ సినిమా నేడు ప్రేక్షకుల ముందుకు వచ్చి అద్భుతమైన ఆదరణ సంపాదించుకుందని చెప్పాలి. ఇక ఈ సినిమా మొదటి షో నుంచి ఈ సినిమా పాజిటివ్ టాక్ సొంతం చేసుకుంది. పలువురు ఈ సినిమాపై ట్విట్టర్ ద్వారా రివ్యూ ఇస్తూ అభిప్రాయాలను తెలియజేశారు. సాయి ధరమ్ తేజ్ కెరియర్ లో బెస్ట్ మూవీ విరూపాక్ష సినిమా అంటూ కొందరు ఈ సినిమాపై కామెంట్ లు చేస్తున్నారు.
ఇక ఈ సినిమా స్క్రీన్ ప్లే, స్టోరీ, బిజీఏం చాలా అద్భుతంగా ఉన్నాయని పలువురు కామెంట్లు చేస్తున్నారు. సాయి ధరమ్ కెరియర్ లోనే బెస్ట్ సినిమా విరూపాక్ష అంటూ కామెంట్లు చేస్తున్నారు. ఈ మధ్యకాలంలో ఇలాంటి సస్పెన్స్ థ్రిల్లర్ మూవీ ఏది రాలేదని, ఇందులో సాయి ధరమ్ తేజ్ అద్భుతంగా నటించారు అంటూ కామెంట్లో చేస్తున్నారు. ఏది ఏమైనా ప్రమాదం తర్వాత కోలుకొని ఈ సినిమా కోసం ఎంతో కష్టపడిన సాయి ధరమ్ తేజ్ కి మంచి కం బ్యాక్ ఇచ్చిందని చెప్పాలి.
ఇలా ఈ సినిమా ద్వారా సాయి ధరమ్ తేజ్ తిరిగి తన లక్ష్యాన్ని చేరుకున్నారని తన ఖాతాలో మరొక అద్భుతమైన హిట్ సినిమాని వేసుకున్నారని తెలుస్తోంది.. ఇలా విరూపాక్ష సినిమా ద్వారా ఇండస్ట్రీలో కి రీ ఎంట్రీ ఇచ్చిన సాయిధరమ్ తేజ్ మంచి సక్సెస్ అందుకున్న ఈ హీరో తన తదుపరి చిత్రాన్ని తన మామయ్య పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో కలిసి నటిస్తున్న విషయం మనకు తెలిసిందే.