Sreemukhi: ఆ విధంగా లక్షలు సంపాదిస్తున్న శ్రీముఖి.. ఏమైందంటే?

Sreemukhi: బుల్లితెర గ్లామరస్ యాంకర్ అంటే అందరికీ ఒకప్పుడు అనసూయ గుర్తుకు వచ్చేది అయితే ప్రస్తుతం అనసూయ బుల్లితెర కార్యక్రమాలకు దూరంగా ఉండడంతో,పెద్ద ఎత్తున ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నటువంటి వారిలో యాంకర్ శ్రీముఖి ముందు వరుసలో ఉంటున్నారు. శ్రీముఖి ప్రస్తుతం బుల్లితెరపై ప్రతి ఒక్క ఛానల్లోనూ వారంలో ఏడు రోజులపాటు ఎంతో బిజీగా గడుపుతూ ఉన్నారు. అయితే కెరీర్ మొదట్లో శ్రీముఖి వెండితెరపై సినిమాలలో నటిస్తూ సందడి చేశారు.

ఇలా వెండితెరపై పలు సినిమాలలో నటించిన ఈమెకు పెద్దగా అవకాశాలు రాకపోవడంతో తిరిగి బుల్లితెర కార్యక్రమాల ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చారు. అయితే బుల్లితెరపై వరుస కార్యక్రమాలకు యాంకర్ గా వ్యవహరిస్తూ భారీ స్థాయిలో ఆదరణ సంపాదించుకున్నారు. ఇలా ప్రతి ఒక్క ఛానల్లోనూ వారం రోజులపాటు ఏదో ఒక కార్యక్రమం ద్వారా బుల్లితెర ప్రేక్షకులను సందడి చేస్తున్నారు.

ఇకపోతే శ్రీముఖి బుల్లితెర ద్వారా కొన్ని లక్షల రూపాయలు సంపాదిస్తుందని తెలుస్తుంది. ఒక్కో కార్యక్రమానికి కేవలం ఒక్క ఎపిసోడ్ కి యాంకర్ గా వ్యవహరిస్తూ మూడు లక్షల రూపాయలు తన అకౌంట్లో పడాల్సిందేనట.ఇలా ఒక్క షో కి యాంకరింగ్ గా వ్యవహరిస్తూ శ్రీముఖి మూడు లక్షల రూపాయల రెమ్యూనరేషన్ తీసుకుంటున్నారు అంటే మామూలు విషయం కాదు.

ఇలా ప్రతిరోజు బుల్లితెరపై ఏదో ఒక కార్యక్రమం ద్వారా ప్రేక్షకుల ముందుకు వస్తూ రోజుకు మూడు లక్షల వరకు సంపాదిస్తున్నారు. ఏది ఏమైనా వెండితెరపై సక్సెస్ సాధించలేనటువంటి శ్రీముఖి బుల్లితెరపై మాత్రం మంచి సక్సెస్ అందుకుంటూ భారీగా సంపాదిస్తున్నారు. బుల్లితెరపై సక్సెస్ సాధించిన ఈమె తిరిగి మరోసారి సినిమాలలో తన అదృష్టాన్ని పరీక్షించుకోవడానికి సిద్ధమయ్యారు.ఒకవైపు యాంకర్ గా కొనసాగుతూనే మరోవైపు సినిమాలలో పలు అవకాశాలను అందుకొని నటించడానికి సిద్ధమయ్యారు.

Related Articles

ట్రేండింగ్

Chandrababu Naidu: చంద్రబాబు నాయుడు రెండో సంతకం ఆ ఫైలుపైనే.. ఆ యాక్ట్ ను రద్దు చేయనున్నారా?

Chandrababu Naidu: ఎన్నికల ప్రచారంలో భాగంగా చంద్రబాబు నాయుడు ప్రకాశం జిల్లాలోని చీరాలలో నిర్వహించిన ప్రజాగళం సభలో మాట్లాడారు. తాము అధికారంలోకి వస్తే చేయబోయే కార్యకలాపాల గురించి ఆ సభలో మాట్లాడారు. అధికారంలోకి...
- Advertisement -
- Advertisement -