Mumbai: సహజీవనం చేసిన ట్రాన్స్ జెండర్ యువకుడు.. కానీ?

Mumbai: ఈ మధ్యకాలంలో చాలామంది ఊహించని విధంగా తీసుకుంటున్న నిర్ణయాలు, రెప్పపాటు కాలంలో కోపంతో చేస్తున్న పనులు జీవితాలను నాశనం చేయడంతో పాటు తలకిందులు చేస్తున్నాయి. కుటుంబాలను వీధిన పడేస్తున్నాయి. కోపంతో మనుషులు ఎంతటి దారుణానికి ఒడిగడుతున్నారో కూడా తెలియకుండా ప్రవర్తిస్తున్నారు. ఇది ఇలా ఉంటే తాజాగా కూడా ఒక యువకుడు క్షణికావేశంలో ఒక ఊహించని నిర్ణయం తీసుకోవడంతో నిండు ప్రాణాలు బలి అయ్యాయి. అసలేం జరిగిందంటే.. ముంబైథానే జిల్లాలోని లాహోటి ప్రాంతంలో కామిల్ జమీన్ అన్సారీ అనే యువకుడు నివసిస్తున్నాడు.

ఇతనికి నవీబస్తీ ప్రాంతానికి చెందిన తౌహిక్ అనే ట్రాన్స్ జెండర్ తో పరిచయం ఉంది. దాంతో వారిద్దరూ చాలాకాలంగా నుంచి స్నేహితులుగా ఉంటున్నారు. అంతేకాకుండా సహజీవనం కూడా చేశారు. అలా వీరి ప్రయాణం కొనసాగుతూ వచ్చింది. అయితే ఏం జరిగిందో ఏమో తెలియదు కానీ వీరిద్దరు గత కొంత కాలంగా డబ్బు విషయంలో గొడవ పడుతున్నారు. ఈ క్రమంలోనే ఇటీవల ఆదివారం రాత్రి సమయంలో భీవండి ప్రాంతంలో ఇద్దరూ ఇదే విషయం పై మరోసారి గొడవపడ్డారు. చివరికి ఒకరిపై ఒకరు మాటల దాడి కూడా చేసుకున్నారు. ఈ నేపథ్యంలోనే కోపంతో ఊగిపోయిన అన్సారీ..

 

అక్కడే ఉన్న ఒక బండరాయితో ట్రాన్స్ జెండర్ తలపై బలంగా బాదాడు. అతని దాడిలో ట్రాన్స్ జెండర్ తౌహిక్ అక్కడికక్కడే రక్తపు మడుగులో పడి ప్రాణాలు విడిచింది. ఇక భయంతో నిందితుడు అక్కడి నుంచి పరారయ్యాడు. ఈ విషయం తెలుసుకున్న పోలీసులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని ట్రాన్స్ జెండర్ మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు. ఆ తర్వాత పోస్ట్ మార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనతో స్థానిక ట్రాన్స్ జెండర్లు అంతా ఏకమై పోలీసులకు ఫిర్యాదు చేశారు. నిందితుడిని కఠినంగా శిక్షించాలంటూ డిమాండ్ చేశారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు ఎట్టకేలకు నిందితుడిని అరెస్ట్ చేశారు.

Related Articles

ట్రేండింగ్

Chandrababu Naidu: చంద్రబాబు నాయుడు రెండో సంతకం ఆ ఫైలుపైనే.. ఆ యాక్ట్ ను రద్దు చేయనున్నారా?

Chandrababu Naidu: ఎన్నికల ప్రచారంలో భాగంగా చంద్రబాబు నాయుడు ప్రకాశం జిల్లాలోని చీరాలలో నిర్వహించిన ప్రజాగళం సభలో మాట్లాడారు. తాము అధికారంలోకి వస్తే చేయబోయే కార్యకలాపాల గురించి ఆ సభలో మాట్లాడారు. అధికారంలోకి...
- Advertisement -
- Advertisement -