Mumbai: పట్టాలపై యువతి.. డ్రైవర్‌ చూడటంతో!

Mumbai:  ప్రస్తుతం అందుబాటులోకి వచ్చిన టెక్నాలజీ కారణంగా ఎలాంటి ఘటన జరిగిన కొన్ని క్షణాల్లో దేశమంతా వ్యాపిస్తోంది. ప్రస్తుత కాలం అమ్మాయిని ప్రతి చిన్న విషయానికి క్షణికావేశంలో ఆత్మహత్యకు పాల్పడుతూ.. వారి కుటుంబాల్లో బాధలు నింపుతున్నారు. ప్రియుడు మోసం చేశాడని.. అమ్మనాన్న తిట్టారని.. స్నేహితులకు బయటకు పంపలేదని.. సిల్లీ కారణాలతో తమ ప్రాణాలు బలి తీసుకుంటున్నారు. ఎలాంటి కారణాలైన వారు తీసుకుంటున్న నిర్ణయాలతో వారి కుటుంబాలు శోకసంధ్రంలో మునిగిపోతున్నాయి. సరిగ్గా ఇలాగే చావునే ఓ యువతి యత్నించగా ఓ పోలీస్‌ అధికారి సాహాసంతో ఆమె ప్రాణాలు దక్కిన ఘటన ముంబయిలో జరిగింది.

ఈ వీడియో సోషల్‌ మీడియాలో చక్కర్లు కొడుతోంది. ముంబయిలోని బైకుల్లా రైల్వే స్టేషన్‌ వివిధ పనులు, ఉద్యోగాలకు వెళ్లేందుకు సిద్ధంగా ఉన్న పయాణికులతో కిటకిటలాడుతోంది. స్టేషన్‌లో ఎవరి పనుల్లో వారు నిమగ్నమై ఉన్నారు. టికెట్లు తీసుకోవడంతో కొందరైతే.. మరో ప్లాట్‌ఫాంపై వచ్చిపోతున్న రైళ్ల నుంచి ప్రయాణికులు ఎక్కుతూ దిగుతున్నారు. ఇలా వారి గమ్యాలను చేరే పనుల్లో ఉన్నారు. అప్పుడు ఓ ప్లాట్‌ఫాంపై వేగంగా దూసుకొస్తున్న రైలును చూసిన ప్రయాణికులు ప్లాట్‌ఫాంకు దూరంగా నిలబడ్డారు. రైలు ఆగితే ఎక్కేందుకు సిద్ధమవుతున్నారు. అంతలోనే ఓ యువతి పట్టాల మీద నుంచి వేగంగా వస్తున్న రైలుకు ఎదురువెళ్తోంది. ఒక్కసారిగా షాక్‌కు గురైన ప్రయాణికులంతా పట్టాలపై నుంచి పక్కకు జరగాలంటూ అరుపులు కేకలు వేస్తున్నారు. కొందరైతే ఇక అయిపోయింది ఆ అమ్మాయి పనంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

ఎంత అరిచినా ఆ అమ్మాయి మాత్రం వారి మాటలు మాటలు వినకుండా వేగంగా వస్తున్న రైలుకు ఎదురుగా వెళ్తూనే ఉంది. దూరం నుంచి పసిగట్టిన రైలు డ్రైవర్‌ రైలు వేగాన్ని కాస్త తగ్గించి ఆపే ప్రయత్నం చేశాడు. అంతోనే అక్కడున్న పోలీస్‌ అధికారి వెంటనే పట్టాలపైకి వెళ్లి ఆ యువతికి పక్కకు జరపడంతో ప్రాణాలు దక్కాయి. ఈ దృశ్యాలన్నీ అక్కడున్న రైల్వే స్టేషన్‌లోని సీసీ కెమెరాలో రికార్డ్‌ అయ్యాయి.

Related Articles

ట్రేండింగ్

YS Sharmila: జాబు రావాలంటే జగన్ పోవాలి.. వైరల్ అవుతున్న షర్మిల సంచలన వ్యాఖ్యలు!

YS Sharmila: ఏపీ పీసీసీ అధ్యక్షురాలు షర్మిల నవ సందేహాలు పేరిట వైయస్ జగన్మోహన్ రెడ్డికి బహిరంగంగా లేఖ రాశారు ఈ లేఖ ద్వారా గత ఎన్నికలకు ముందు జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన...
- Advertisement -
- Advertisement -