Anchor Jhansi: పోలీస్ కేస్ లో దొరికానని ప్రచారం చేశారన్న ఝాన్సీ.. అవి పోయాయంటూ?

Anchor Jhansi: సాధారణంగా సినిమా సెలబ్రిటీలు అన్న తర్వాత వారి గురించి ఎన్నో రకాల వార్తలు సోషల్ మీడియాలో వైరల్ అవుతూనే ఉంటాయి. ముఖ్యంగా పలానా సెలబ్రిటీలు రిలేషన్ లో ఉన్నారని,వీరికి వేరే హీరోలతో ఎఫైర్స్ ఉన్నాయి అంటూ పెద్ద ఎత్తున నటీమణుల గురించి వార్తలు రాస్తూ ఉంటారు. అయితే ఈ వార్తలపై కొందరు స్పందించి ఘాటుగా రియాక్ట్ అవుతూ ఉంటారు. మరి కొందరు చూసి చూడనట్టుగా వదిలేస్తూ ఉంటారు.

ఇలా సెలబ్రిటీల గురించి ఈ విధమైనటువంటి వార్తలు సోషల్ మీడియాలో వైరల్ కావడంతో కొంతమంది సెలబ్రిటీలు ఇండస్ట్రీలో మంచి అవకాశాలను కోల్పోవడమే కాకుండా తమ కెరీయర్ ను కూడా నాశనం చేసుకున్నటువంటి వారు ఎంతోమంది ఉన్నారు. తాజాగా ఈ వార్తలు పై బుల్లితెర యాంకర్ ఝాన్సీ స్పందించారు. ఈ సందర్భంగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్నటువంటి ఝాన్సీ తన గురించి గతంలో వచ్చిన వార్తలపై ఈ సందర్భంగా స్పందిస్తూ క్లారిటీ ఇచ్చారు.

 

బుల్లితెర యాంకర్ గా ఎంతో పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్న ఈమె అనంతరం సినిమా అవకాశాలను అందుకొని పలు సినిమాలలో నటిస్తూ సందడి చేశారు. ఇలా వెండితెర పైన బుల్లితెర పైన ఒకానొక సమయంలో ఓ వెలుగు వెలిగిన ఝాన్సీ గురించి గతంలో ఒక వెబ్సైట్ రాసినటువంటి వార్తల కారణంగా తాను ఎన్నో అవకాశాలను కోల్పోయాను అంటూ ఈ సందర్భంగా ఈమె ఆవేదన వ్యక్తం చేశారు.

 

తాను ఒక హీరోతో ఎఫైర్ పెట్టుకున్నాను అంటూ వార్తలు రాశారు అలాగే పోలీస్ రైడ్ లోదొరికిపోయాను అంటూ వార్తలు రాశారు. ఇలా నిజానిజాలు తెలియకుండా ఒక వ్యక్తి గురించి ఈ విధమైనటువంటి అసత్యపు వార్తలు రాస్తే వారు ఎంత మానసికక్షోభకు గురవుతారనే విషయాన్ని పట్టించుకోరని ఈమె తెలియజేశారు.ఇలా ఝాన్సీ తన గురించి వార్తలు రాశారని చేసినటువంటి ఈ కామెంట్స్ వైరల్ అయ్యాయి అయితే ఏ హీరోతో ఈమె ఎఫైర్ పెట్టుకుందనే విషయం గురించి కూడా ఆరా తీస్తున్నారు అయితే ఈమె నాగార్జునతో ఎఫైర్ పెట్టుకుంది అంటూ అప్పట్లో ఈమె గురించి పెద్ద ఎత్తున వార్తలు హల్చల్ చేశాయి.

Related Articles

ట్రేండింగ్

YS Sharmila: జాబు రావాలంటే జగన్ పోవాలి.. వైరల్ అవుతున్న షర్మిల సంచలన వ్యాఖ్యలు!

YS Sharmila: ఏపీ పీసీసీ అధ్యక్షురాలు షర్మిల నవ సందేహాలు పేరిట వైయస్ జగన్మోహన్ రెడ్డికి బహిరంగంగా లేఖ రాశారు ఈ లేఖ ద్వారా గత ఎన్నికలకు ముందు జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన...
- Advertisement -
- Advertisement -