Gold Anklets: మహిళలు బంగారు పట్టీలు దరిస్తే ఏమవుతుందంటే?

Gold Anklets: మహిళలు పట్టీలు లేదా గొలుసులు ధరించడం అన్నది ఎప్పటినుంచో వస్తున్న భారతీయ సంప్రదాయం. నెలరోజుల పాప నుంచి 40,50 ఏళ్ల స్త్రీల వరకు పట్టీలను ధరిస్తూ ఉంటారు. కొందరు పట్టీలు వేసుకుంటే మరికొందరు కడియాలు ధరిస్తూ ఉంటారు. ఆడపిల్లలు కాళ్లకు పట్టిలు వేసుకొని ఇంట్లో అటు ఇటు తిరుగుతూ ఉంటే ఇంట్లో మహాలక్ష్మి తిరుగుతూ ఉన్నట్టుంది అని అంటూ ఉంటారు పెద్దలు. అయితే ఎక్కువ శాతం మంది పట్టీలు వెండితో చేసిన మాత్రమే ధరిస్తూ ఉంటారు. వివాహ సమయంలో కూడా కాలికి వెండి మెట్టెలనే తొడుగుతూ ఉంటారు. చాలా తక్కువ మంది బాగా డబ్బు ఉన్న వారు మాత్రమే బంగారు పట్టీలు బంగారు మెట్టెలను ధరిస్తూ ఉంటారు.

ప్రస్తుత రోజుల్లో బంగారు పట్టీలు బంగారు మెట్టెలు అన్నది ఫ్యాషన్ అయిపోయింది. కానీ చాలామందికి తెలియని విషయం ఏమిటంటే.. అలా బంగారు పట్టీలు ధరించడం శుభప్రదం కాదంటున్నాయి శాస్త్రాలు. పురాణాల ప‌రంగా కూడా దీని వెనుక అనేక కారణాలు ఉన్నాయి. హిందూ పురాణాల ప్రకారం అయితే బంగారం అంటే లక్ష్మి. ల‌క్ష్మీదేవికి ప‌సుపు రంగు అంటే ఇష్టం. ఈ క్రమంలో బంగారం కూడా ప‌సుపు రంగులో ఉంటుంది కాబట్టి ఆ రంగు వస్తువులను ఎవరూ కాళ్ళకి ధ‌రించ‌కూడ‌దని చెబుతున్నాయి. అలాగే వెండి శ‌రీరానికి చ‌లువ చేస్తుంది. వెండి పట్టీలను ధరించడం వల్ల నడుము నొప్పి, మోకాళ్ల నొప్పుల నుంచి ఉపశమనం లభిస్తుంది.

 

అంతేకాకుండా రక్తప్రసరణ సజావుగా సాగుతూ, పాదాలు వాపులు రాకుండా సహకరిస్తాయి. కానీ అలాంటి నమ్మకాలతో కూడా, బంగారు చీలమండ దేవత పట్ల అగౌరవానికి చిహ్నంగా ఉన్నట్లు కనిపిస్తోంది. దీనికి ప్రధాన కారణం బంగారంతో చేసిన ఆభరణాలు ఉపకరణాలు శరీరాన్ని వేడిగా ఉంచుతాయి. మరోవైపు, వెండి శరీరాన్ని చల్లబరుస్తుంది. అందువల్ల, మీ శరీర ఉష్ణోగ్రతలో సమతుల్యతను సృష్టించడానికి బంగారాన్ని నడుము పైన ధరిస్తారు, అలాగే వెండిని నడుము క్రింద ధరిస్తారు. బంగారు చీలమండ ధరించడం చాలా సింబాలిక్ కావచ్చు చాలా సందర్భాలలో, బంగారు చీలమండ ధరించిన ఒక మహిళ తాను వివాహం చేసుకున్నట్లు చూపిస్తుంది. కాబట్టిఇప్పుడు కూడా బంగారు పట్టీలను ధరించరాదు. అది శాస్త్రీయ పరంగా అలాగే సైన్స్ పరంగా కూడా అంత మంచిది కాదు.

Related Articles

ట్రేండింగ్

Chandrababu Naidu: చంద్రబాబు నాయుడు రెండో సంతకం ఆ ఫైలుపైనే.. ఆ యాక్ట్ ను రద్దు చేయనున్నారా?

Chandrababu Naidu: ఎన్నికల ప్రచారంలో భాగంగా చంద్రబాబు నాయుడు ప్రకాశం జిల్లాలోని చీరాలలో నిర్వహించిన ప్రజాగళం సభలో మాట్లాడారు. తాము అధికారంలోకి వస్తే చేయబోయే కార్యకలాపాల గురించి ఆ సభలో మాట్లాడారు. అధికారంలోకి...
- Advertisement -
- Advertisement -