Health Tips: ఆ 5 రకాల సమస్యలు తగ్గాలంటే ఈ డ్రై ఫ్రూట్ తినాల్సిందే?

Health Tips: డ్రై ఫ్రూట్స్ లో ఒకటైన పిస్తా గురించి మనందరికీ తెలిసిందే. పిస్తా వల్ల ఎన్నో రకాల ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి అన్న విషయం అందరికీ తెలిసిందే. ముఖ్యంగా మధుమేహం వ్యాధిగ్రస్థులకు ఇది మంచిది కాదు. ముఖ్యంగా పిస్తా అనేది మదుమేహం వ్యాధి నియంత్రణకు అద్భుతంగా పనిచేస్తుంది. కాగా షుగర్ సమస్యతో పాటు ఐదు రకాల సమస్యలు ఉన్నవారు పిస్తా తీసుకోవడం వల్ల ఆ సమస్యలు మాయం అవుతాయి. పిస్తాలో గ్రైసెమిక్ ఇండెక్స్ చాలా తక్కువ.

ఫలితంగా బ్లడ్ షుగర్ లెవెల్స్ నియంత్రణలో ఉంటాయి. బరువు నియంత్రణ పిస్తా ఫైబర్ రిచ్ ఫుడ్‌గా పరిగణిస్తారు. పిస్తా తినడం వల్ల చాలా సేపటి వరకూ ఆకలి వేయదు. దాంతోపాటుగా జీర్ణక్రియ కూడా మెరుగుపడుతుంది. పిస్తా రోజూ తినడం వల్ల బరువు నియంత్రణ ఉంటుంది. ఇమ్యూనిటీ పటిష్టం క్రమం తప్పకుండా పిస్తా తినేవారిలో ఇమ్యూనిటీ పెరుగుతుంది. ఇందులో జింక్, విటమిన్ బి6 కారణంగా రోగ నిరోధక శక్తి పెరుగుతుంది. పిస్తాలో విటమిన్లు, మినరల్స్, ప్రోటీన్లు, కార్బొహైడ్రేట్లు పుష్కలంగా లభిస్తాయి.

ఇవి శరీర ఆరోగ్యానికి చాలా ఉపయోగకరం. ఇందులో ఫ్యాట్, కేలరీలు తక్కువగా ఉన్నందున సూపర్ హెల్తీ ఫుడ్‌ గా పిలుస్తారు. జీర్ణక్రియ పిస్తాలో ఉండే ఫైబర్ కడుపుకి చాలా మంచిది. దీంతో అజీర్తి, ఎసిడిటీ, గ్యాస్ వంటి సమస్యలు దూరమౌతాయి. అందుకే చాలామంది మెరుగైన జీర్ణక్రియ కోసం పిస్తా తినమనే సలహా ఇస్తుంటారు. ఎనీమియా పిస్తా తినడం వల్ల శరీరంలో ఐరన్ లోపం తొలగిపోతుంది. దీనివల్ల శరీరంలో హిమోగ్లోబిన్ స్థాయి పెరుగుతుంది. దాంతో ఎనీమియా సమస్య తలెత్తదు.

Related Articles

ట్రేండింగ్

CM Jagan: కూటమి విజయాన్ని ఫిక్స్ చేసిన జగన్.. మేనిఫెస్టో హామీలతో బొక్కా బోర్లా పడ్డారా?

CM Jagan: త్వరలోనే అసెంబ్లీ ఎన్నికలు జరగబోతున్నటువంటి తరుణంలో పెద్ద ఎత్తున ప్రచార కార్యక్రమాలలో నిర్వహిస్తున్నారు. అయితే వైసిపి అధినేత జగన్మోహన్ రెడ్డి వై నాట్ 175 అంటూ ప్రచార కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు....
- Advertisement -
- Advertisement -