Nellore: నెల్లూరు డిప్యూటీ మేయర్ సంచలన వ్యాఖ్యలు.. అనిల్ కు షాకిస్తూ?

Nellore: రాజకీయమన్న తర్వాత కక్ష సాధింపులు సర్వసాధారణమైన విషయం మనకు తెలిసిందే. అయితే ఒకే పార్టీలో ఉన్నటువంటి నేతలు ఇలా కక్ష సాధింపు చర్యలకు పాల్పడడం అందరిని ఆశ్చర్యానికి గురిచేస్తుంది. ఈ క్రమంలోనే నెల్లూరు డిప్యూటీ మేయర్ రూప్ కుమార్ యాదవ్ అనుచరుడు వైకాపా విద్యార్థి నేత హాజీ పై శుక్రవారం గుర్తు తెలియని వ్యక్తులు దాడికి ప్రయత్నం చేశారు. ప్రస్తుతం ఈయన నెల్లూరు ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు.

ఇలా ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నటువంటి హాజీని డిప్యూటీ మేయర్ రూప్ కుమార్ యాదవ్ పరామర్శించారు. ఇలా తన అనుచరుడిపై గుర్తు తెలియని వ్యక్తులు దాడి చేయడం పట్ల రూప్ కుమార్ యాదవ్ తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు.ఈ సందర్భంగా రూప్ కుమార్ యాదవ్ మాట్లాడుతూ హాజీ వైసిపి పార్టీ ఆవిర్భావం అయినప్పటి నుంచి పార్టీలోనే ఉన్నారు. అతనిపై కత్తులతో దాడికి ప్రయత్నం చేశారు. ఆ సమయంలో పోలీసులకు ఫిర్యాదు కూడా చేసామని తెలిపారు.

 

అయితే పోలీసులు అప్పుడే స్పందించి యాక్షన్ తీసుకొని కనుక ఉంటే ఇలా మరోసారి దాడికి ప్రయత్నం చేసేవారు కాదని ఈ సందర్భంగా రూప్ కుమార్ యాదవ్ పేర్కొన్నారు. అయితే ఈ దాడి వెనుక ఎమ్మెల్యే అనిల్ కుమార్ యాదవ్ హస్తముందని అభిప్రాయపడ్డారు. ఇలాంటి దాడులు చేయడం మంచిది కాదంటూ ఈయన హెచ్చరికలు కూడా జారీ చేశారు.

 

ఇంకోసారి నా కార్యకర్తలపై దాడికి ప్రయత్నిస్తే అసలు ఊరుకోనని నేను ప్రతీకారం తీర్చుకోవడం మొదలుపెడితే అది మీ ఊహకు కూడా అందరంటూ వార్నింగ్ ఇచ్చారు ఇది ఇలాగే కొనసాగితే తాను పార్టీ పెద్దలకు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి దృష్టికి కూడా తీసుకెళ్లాల్సిన అవసరం ఉంటుందని తెలిపారు. సొంత పార్టీ నేతలే నెల్లూరులో వైకాపాను సర్వనాశనం చేస్తున్నారని మండిపడ్డారు.

Related Articles

ట్రేండింగ్

Chandrababu Naidu: చంద్రబాబు నాయుడు రెండో సంతకం ఆ ఫైలుపైనే.. ఆ యాక్ట్ ను రద్దు చేయనున్నారా?

Chandrababu Naidu: ఎన్నికల ప్రచారంలో భాగంగా చంద్రబాబు నాయుడు ప్రకాశం జిల్లాలోని చీరాలలో నిర్వహించిన ప్రజాగళం సభలో మాట్లాడారు. తాము అధికారంలోకి వస్తే చేయబోయే కార్యకలాపాల గురించి ఆ సభలో మాట్లాడారు. అధికారంలోకి...
- Advertisement -
- Advertisement -