Charan: నందమూరి హృదయాలను గెలుచుకున్న చరణ్.. అలా చేయడంతో?

Charan: తెలుగు సినిమా ఇండస్ట్రీలో నటుడిగా ఎంతో పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్న మెగా వారసు రామ్ చరణ్ తేజ్ ప్రస్తుతం గ్లోబల్ స్టార్ గా కూడా పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్నారు.ఇలా గ్లోబల్ స్టార్ గా గుర్తింపు పొందిన రాంచరణ్ ఎక్కడ తగ్గాలో ఎక్కడ నెగ్గాలో బాగా తెలుసు. ఇలా పరిస్థితులను బట్టి తన వ్యవహార శైలిని మార్చుకుంటూ అందరికీ ఎంతో మంచివాడిగా అందరి ప్రశంసలు అందుకుంటున్నారు.

ఈ క్రమంలోనే తాజాగా ఎన్టీఆర్ శత జయంతి వేడుకలలో భాగంగా ఎంతో మంది సెలబ్రిటీలు పాల్గొన్నారు. అక్కడ రామ్ చరణ్ మాత్రం చాలా హైలైట్ అయ్యారు. తన తాత శత జయంతి వేడుకలకు స్వయంగా ఎన్టీఆర్ కళ్యాణ్ రామ్ దూరంగా ఉన్నప్పటికీ రామ్ చరణ్ మాత్రం హాజరై అందరి దృష్టిని ఆకర్షించారు.
రామ్ చరణ్-ఎన్టీఆర్ మంచి దోస్త్ లు. కానీ ఆర్ఆర్ఆర్ గ్లోబల్ అవార్డు, ఆస్కార్ అవార్డ్ టైమ్ లో ఎక్కడో ఏదో జరిగింది. బెడిసికొట్టింది.

 

ఒకప్పుడు కలిసి ఇద్దరు పుట్టినరోజు వేడుకలను ఘనంగా జరుపుకునేవారు అయితే ఈ ఏడాది మాత్రం వీరిద్దరూ పుట్టినరోజు వేడుకలకు హాజరు కాకపోవడం ఏదో సోషల్ మీడియా వేదికగా చెప్పాల్సి ఉంది కాబట్టి పుట్టినరోజు శుభాకాంక్షలు చెప్పుకున్నారు.ఇలా నందమూరి కుటుంబ సభ్యులకు ఎన్టీఆర్ దూరంగా ఉండి రామ్ చరణ్ హాజరు కావడంతో ఈ కార్యక్రమంలో రామ్ చరణ్ చాలా హైలైట్ అయ్యారు.

ఇలా నందమూరి తారకరామారావు శత జయంతి వేడుకలకు రామ్ చరణ్ హాజరు కావడంతో నందమూరి అభిమానులకు ఈయన కూడా తెగ నచ్చేసాడు అయితే తెలుగుదేశం పార్టీ గురించి ఏమాత్రం వ్యతిరేకంగా మాట్లాడిన అదే అభిమానులు అదే మీడియా పాతాళానికి తొక్కేస్తుంది అనే విషయం మనకు తెలిసిందే. ఏది ఏమైనా ఎన్టీఆర్ శతజయంతి వేడుకలకు పవన్ కళ్యాణ్ హాజరవుతారని చివరికి హాజరు కాలేదు కానీ పవన్ స్థానాన్ని మాత్రం చరణ్ భర్తీ చేశారు అయితే ఈ వేడుకలకు చరణ్ హాజరు కావడంతో ఎన్టీఆర్ చరణ్ మధ్య మరింత దూరం పెరిగే అవకాశాలు కూడా ఉన్నాయని తెలుస్తోంది.

Related Articles

ట్రేండింగ్

CM Jagan: కూటమి విజయాన్ని ఫిక్స్ చేసిన జగన్.. మేనిఫెస్టో హామీలతో బొక్కా బోర్లా పడ్డారా?

CM Jagan: త్వరలోనే అసెంబ్లీ ఎన్నికలు జరగబోతున్నటువంటి తరుణంలో పెద్ద ఎత్తున ప్రచార కార్యక్రమాలలో నిర్వహిస్తున్నారు. అయితే వైసిపి అధినేత జగన్మోహన్ రెడ్డి వై నాట్ 175 అంటూ ప్రచార కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు....
- Advertisement -
- Advertisement -