Rajasthan: డాన్స్ చేస్తూ వచ్చిన వరుడికి యువతి షాక్.. మరో వ్యక్తికి ఓకే చెప్పడంతో?

Rajasthan: ప్రస్తుత కాలంలో పెళ్లి అంటే ఎంతో అంగరంగ వైభవంగా జరుపుకుంటూ ఉంటారు.జీవితంలో పెళ్లి ఒకేసారి చేసుకుంటారు కనుక తమకు ఎప్పటికీ గుర్తుండి పోవాలన్న ఉద్దేశంతో ఎన్నో ఏర్పాట్లను చేస్తూ ఘనంగా పెళ్లిని జరుపుకోవాలని ప్రతి ఒక్కరూ భావిస్తూ ఉంటారు. ఇలా పెళ్లిని ఘనంగా జరుపుకోవాలని చాలామంది ఎక్కువ సమయం పెళ్లిలో జరిగే సాంప్రదాయమైన ఆచార వ్యవహారాలకు కాకుండా ఆటపాటలకు ఫోటోలకు అధిక ప్రాధాన్యత ఇస్తుంటారు.

అయితే ఇలా పెళ్లిలో కొన్నిసార్లు మనం చేసే కొన్ని పొరపాట్లు తీవ్ర పరిణామాలకు కూడా కారణం అవుతుంటాయి. తాజాగా ఇలాంటి ఘటన ఒకటి రాజస్థాన్లో చోటుచేసుకుంది పెళ్లి కుమారుడు కళ్యాణ మండపానికి ఎంతసేపటికి రాకపోవడంతో ఆగ్రహం తెచ్చుకున్న వధువు మరొక అబ్బాయిని పెళ్లి చేసుకున్న ఘటన వెలుగులోకి వచ్చింది. పూర్తి వివరాలలోకి వెళితే…

 

రాజస్థాన్లోని చురులోఓ పెళ్ళికొడుకు కళ్యాణ మండపానికి ఊరేగింపుగా ఇంటి నుంచి బయలుదేరారు అయితే తన స్నేహితులతో కలిసి ఆటపాటలతో డాన్సులు చేస్తూ కళ్యాణ మండపానికి రావడానికి చాలా ఆలస్యం అయింది.ఇలా వరుడు స్నేహితులతో డాన్స్ చేసుకుంటూ కళ్యాణ మండపం వద్దకు వచ్చేసరికి దాదాపు తెల్లవారుజామున రెండు గంటల సమయం అయింది అయితే అప్పటివరకు పెళ్లి కొడుకు కోసం ఎంతగానో ఎదురు చూస్తూ కూర్చున్నటువంటి వధువుకి పట్టరాని కోపం వచ్చింది.

 

ఇలా పెళ్లి కొడుకు కోసం ఎదురుచూస్తూ విసుగు చెందిన ఆమె పెళ్లికి వచ్చినటువంటి మరొక వ్యక్తిని వివాహం చేసుకుంది. అయితే కల్యాణ మండపానికి వచ్చిన వరుడు ఇది చూసి ఒక్కసారిగా కంగుతున్నాడు. దీంతో చేసేదేమీ లేక వరుడు కల్యాణ మండపం నుంచి వెనుతిరిగి వెళ్ళిపోయాడు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన ఈ వార్త సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

Related Articles

ట్రేండింగ్

Chandrababu Naidu: చంద్రబాబు నాయుడు రెండో సంతకం ఆ ఫైలుపైనే.. ఆ యాక్ట్ ను రద్దు చేయనున్నారా?

Chandrababu Naidu: ఎన్నికల ప్రచారంలో భాగంగా చంద్రబాబు నాయుడు ప్రకాశం జిల్లాలోని చీరాలలో నిర్వహించిన ప్రజాగళం సభలో మాట్లాడారు. తాము అధికారంలోకి వస్తే చేయబోయే కార్యకలాపాల గురించి ఆ సభలో మాట్లాడారు. అధికారంలోకి...
- Advertisement -
- Advertisement -