Jr NTR: తాత మృతిపై తారక్ పోస్ట్ చూస్తే కన్నీళ్లు పెట్టాల్సిందే!

Jr NTR: నందమూరి ఫ్యామిలీ గురించి టాలీవుడ్ ప్రేక్షకులకు కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు. ఈ కుటుంబం నుండి ఎంతో మంది హీరోలు టాలీవుడ్ లో స్టార్ హీరోలుగా స్థానం సంపాదించుకున్నారు. ముఖ్యంగా జూనియర్ ఎన్టీఆర్ గ్లోబల్ స్టార్ గా పేరు సంపాదించుకొని తాతకు తగ్గ మనవడు అని నిరూపించాడు. అయితే ఇదంతా పక్కన పెడితే తాజాగా తన తాత ఎన్టీఆర్ మృతి పట్ల బాగా ఎమోషనల్ అయ్యాడు ఎన్టీఆర్.

తెలుగు సినీ ఇండస్ట్రీలో సీనియర్ ఎన్టీఆర్ ఎంత గొప్ప పేరు సంపాదించుకున్నాడో.. ఎంత మంచి అభిమానం సంపాదించుకున్నాడో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. చారిత్రక, జానపద, పౌరాణిక సినిమాలతో ప్రేక్షకులను అలరించాడు ఎన్టీఆర్. 300 కు సినిమాలలో నటించి తెలుగు తెరపై రికార్డు సంపాదించుకున్నాడు. రాజకీయపరంగా కూడా ఈయన ప్రజా నాయకుడిగా పేరు సంపాదించుకున్నాడు.

 

ఇక ఈయన ఈ లోకానికి దూరమైనప్పటికీ కూడా తెలుగు ప్రజలు మాత్రం ఆయనను మరవలేక పోతున్నారు. అయితే ఈ రోజు ఎన్టీ రామారావు గారి శతజయంతి సందర్భంగా పలు వేడుకలు నిర్వహించారు. ఈ నేపథ్యంలో ఆయన కుటుంబ సభ్యులు ఆయన గురించి సోషల్ మీడియా వేదిక ద్వారా తెలుపుతూ బాగా ఎమోషనల్ అవుతున్నారు.

 

అందులో జూనియర్ ఎన్టీఆర్ కూడా బాగా ఎమోషనల్ అయ్యాడు. తన ట్విట్టర్ వేదికగా స్పందిస్తూ.. మీ పాదం మోపక తెలుగు ధరిత్రి చిన్నబోతుంది.. మీ రూపు కానక తెలుగు గుండె తల్లడిల్లిపోతుంది. పెద్ద మనసుతో ఈ ధరిత్రిని, ఈ గుండెను మరొక్కసారి తాకిపో తాత.. సదా మీ ప్రేమకు బానిసను అంటూ ఎమోషనల్ అవుతూ కనిపించాడు. ఇక ఆయన చేసిన ట్వీట్ ప్రస్తుతం బాగా వైరల్ అవుతుంది.

Related Articles

ట్రేండింగ్

Chandrababu Naidu: చంద్రబాబు నాయుడు రెండో సంతకం ఆ ఫైలుపైనే.. ఆ యాక్ట్ ను రద్దు చేయనున్నారా?

Chandrababu Naidu: ఎన్నికల ప్రచారంలో భాగంగా చంద్రబాబు నాయుడు ప్రకాశం జిల్లాలోని చీరాలలో నిర్వహించిన ప్రజాగళం సభలో మాట్లాడారు. తాము అధికారంలోకి వస్తే చేయబోయే కార్యకలాపాల గురించి ఆ సభలో మాట్లాడారు. అధికారంలోకి...
- Advertisement -
- Advertisement -