Prabhas: అయోధ్య రామాలయానికి ప్రభాస్ భారీ విరాళం.. నిజంగా గొప్పోడంటూ?

Prabhas: టాలీవుడ్ హీరో ప్రభాస్ నటించిన తాజా చిత్రం ఆదిపురుష్. ఈ సినిమా ఎప్పుడెప్పుడు విడుదల అవుతుందా అని అభిమానులు ఎంతో ఆతృతగా ఎదురుచూస్తున్నారు. కోట్ల బడ్జెట్ తో నిర్మితమైన ఈ సినిమాపై ఇప్పటికే భారీగా అంచనాలు నెలకొన్నాయి. ఇది ఇలా ఉంటే ఈ సినిమా ఫ్రీ రిలీజ్ ఈవెంట్ ను ఆధ్యాత్మిక క్షేత్రం అయినా తిరుపతిలో చిత్ర యూనిట్ నేడు నిర్వహించనున్నారు. భారీ స్థాయిలో రామాయణం సహా, ఇతర హిందూపురాణ గాథల ప్రదర్శనలను ఏర్పాటు చేశారు.

ఆదిపురుషుడు రాముడిగా ప్రభాస్ హాలోగ్రామ్ కటౌట్ ను యాభై అడుగుల ఎత్తుతో అత్యంత భారీగా ఏర్పాటు చేయబోతున్నట్టు కూడా వార్తలు వస్తున్నాయి. అలాగే ఆదిపురుష్ మేకర్స్ ద్వారా అత్యంత విశ్వసనీయంగా తెలుస్తున్న సమాచారాన్ని బట్టి అయోధ్య రామాలయ నిర్మాణానికి కనీ వినీ ఎరుగనంత భారీ విరాళాన్నీ ఇవాళ ప్రీరిలీజ్ ఈవెంట్ వేదిక పై ప్రకటించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. కాగా ఈ ఆదిపురుష్ సినిమాని రామాయణం ఆధారంగా నిర్మించిన విషయం తెలిసిందే.

 

అయోధ్య రామాలయ నిర్మాణానికి కనీసం పదికోట్ల రూపాయల విరాళం ఇవ్వబోతున్నట్టుగా తెలుస్తోంది. అయోధ్య ఆలయంకోసం ఇచ్చినట్లయితే పాన్ ఇండియా చిత్రం ప్రమోషన్స్ కు కూడా ప్లస్ అవుతుందని తలపోశారట. ఈ విషయాన్ని రహస్యంగా ఉంచి, ప్రీ రిలీజ్ ఈవెంట్ లో హీరో ప్రభాస్ ద్వారా ప్రకటింపజేసి సంచలనం సృష్టించాలని మేకర్స్ ప్లాన్. భారీ అంచనాల నడుమ విడుదల కాబోతున్న ఈ సినిమా ప్రేక్షకులను ఏ మేరకు మెప్పిస్తుందో చూడాలి మరి.

 

Related Articles

ట్రేండింగ్

Chandrababu Naidu: చంద్రబాబు నాయుడు రెండో సంతకం ఆ ఫైలుపైనే.. ఆ యాక్ట్ ను రద్దు చేయనున్నారా?

Chandrababu Naidu: ఎన్నికల ప్రచారంలో భాగంగా చంద్రబాబు నాయుడు ప్రకాశం జిల్లాలోని చీరాలలో నిర్వహించిన ప్రజాగళం సభలో మాట్లాడారు. తాము అధికారంలోకి వస్తే చేయబోయే కార్యకలాపాల గురించి ఆ సభలో మాట్లాడారు. అధికారంలోకి...
- Advertisement -
- Advertisement -