Prabhas: ఆదిపురుష్ లో చేసిన తప్పే మళ్ళీ రిపీట్ చేస్తున్న ప్రభాస్?

Prabhas: టాలీవుడ్ పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ ప్రస్తుతం వరుసగా సినిమాలలో నటిస్తూ దూసుకుపోతున్న విషయం తెలిసిందే. ప్రభాస్ చేతిలో ప్రస్తుతం రెండు మూడు పాన్ ఇండియా సినిమాలు ఉన్నాయి.. ఇటీవల ప్రభాస్ ఆదిపురుష్ సినిమాతో ప్రేక్షకులను పలకరించిన విషయం తెలిసిందే. పాన్ ఇండియా స్థాయిలో రూపు దిద్దుకున్న ఈ సినిమా భారీ అంచనాల నడుమ విడుదల అయ్యి మిక్స్డ్ టాక్ ని సొంతం చేసుకున్నప్పటికీ బాక్స్ ఆఫీస్ వద్ద కోట్లలో కలెక్షన్స్ ని రాబట్టింది. ఇది ఇలా ఉంటే ఈ సినిమాపై భారీగా విమర్శలు నెగిటివ్ కామెంట్స్ కూడా వచ్చిన విషయం తెలిసిందే.

ప్రభాస్ కి భారీగా క్రేజ్ ఉండడంతో వేసిన 400 కోట్ల వరకు కలెక్షన్స్ రాబట్టింది.. ఇకపోతే ఈ సినిమాలోని పాత్రలపై సన్నివేశాలపై భారీగా విమర్శలు వచ్చిన విషయం తెలిసిందే. రాముడి పాత్రలో నటన పరంగా ప్రభాస్ పర్వాలేదు అనిపించుకున్నారు. కాగా డార్లింగ్ అభిమానులను ఆదిపురుష్ సినిమా తీవ్రంగా నిరాశ పరచడంతో అభిమానులు ఆశలన్నీ కూడా తదుపరి సినిమా ప్రాజెక్ట్ కె పైన పెట్టుకున్నారు. నాగ్ అశ్విన్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో అమితాబ్ బచ్చన్, దీపికా పదుకొనే, దిశా పటానీ, కమల్ హాసన్ వంటి స్టార్ నటీనటులు పనిచేస్తున్న విషయం తెలిసిందే.

 

ఇది ఇలా ఉంటే ఈ సినిమాలో ప్రభాస్ విష్ణుమూర్తి అవతారంలో కనిపించబోతున్నట్టు తెలుస్తోంది. కే అంటే కల్కి అని అర్ధమట. కల్కి అంటే వెంకటేశ్వర స్వామి, విష్ణు మూర్తి మరో రూపం ఆయన. ఆయనే భూమి మీదకు వచ్చి అడ్వాన్స్ వెపన్స్‌తో దుర్మార్గుల ఆట కట్టిస్తాడని వార్తలు వినిపిస్తున్నాయి. దీంతో అభిమానులు ఆనందం వ్యక్తం చేస్తూనే ఆందోళన చెందుతున్నారు. రాముడిగా ప్రభాస్‌ను చూడలేని చాలా మంది ఇప్పుడు విష్ణు అవతారమనే సరికి ఇదేమీ ట్విస్ట్ అంటూ మీమ్స్‌తో రెచ్చిపోతున్నారు. ఇప్పటికే ప్రభాస్ ను అలా చూసిన అభిమానులు తీవ్రంగా చెందిన విషయం తెలిసిందే. ఈ వార్త సోషల్ మీడియాలో వైరల్ అవ్వడంతో కొంతమంది నెటిజన్స్ ఈ వార్త స్పందిస్తూ ఆది పురుష్ సినిమా విషయంలో చేసిన తప్పులే ప్రభాస్ మళ్ళీ మళ్ళీ చేస్తున్నాడు అంటూ కామెంట్స్ చేస్తున్నారు..

 

Related Articles

ట్రేండింగ్

CM Jagan: కూటమి విజయాన్ని ఫిక్స్ చేసిన జగన్.. మేనిఫెస్టో హామీలతో బొక్కా బోర్లా పడ్డారా?

CM Jagan: త్వరలోనే అసెంబ్లీ ఎన్నికలు జరగబోతున్నటువంటి తరుణంలో పెద్ద ఎత్తున ప్రచార కార్యక్రమాలలో నిర్వహిస్తున్నారు. అయితే వైసిపి అధినేత జగన్మోహన్ రెడ్డి వై నాట్ 175 అంటూ ప్రచార కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు....
- Advertisement -
- Advertisement -