Adipurush: ప్రభాస్ అలా చేయకపోతే ఆదిపురుష్ నిర్మాతలు నిండా మునిగేవారా?

Adipurush: ప్రభాస్ నటించిన ఆది పురుష్ సినిమాని ఇంకా వివాదాలు వెంటాడుతూనే ఉన్నాయి. ఈ సినిమా నుంచి ప్రభాస్ ఫస్ట్ లుక్ పోస్టర్ విడుదల చేస్తున్న సమయం నుంచి ఎన్నో వివాదాలు వస్తూనే ఉన్నాయి. ఇలా ఒకవైపు ఈ సినిమా పై నెగిటివిటీ ఏర్పడుతున్న తరుణంలో ఆ నెగిటివిటీని కొట్టి పారేసే ప్రయత్నం చేస్తున్నారు చిత్రబృందం. అయినప్పటికీ ఈ సినిమా మాత్రం ఊహించిన స్థాయిలో ఫలితాలను అందుకోలేకపోయింది.

 

ఇక ఈ సినిమా మిశ్రమ స్పందన అందుకున్నప్పటికీ ఫ్రీ రిలీజ్ బిజినెస్ కారణంగానే టి సిరీస్ బ్యానర్ నష్టాలలో పడకుండా గట్టెక్కిందని తెలుస్తుంది. ఇక ఈ విషయంలో మాత్రం ప్రభాస్ నిర్ణయం కీలకంగా మారిందని ప్రభాస్ కనక ఈ నిర్ణయం తీసుకోకపోతే పూర్తిగా నష్టాలు వచ్చేవని తెలుస్తోంది. మరి ప్రభాస్ తీసుకున్నటువంటి ఆ నిర్ణయం ఏంటి అనే విషయానికి వస్తే…

ఈ సినిమా దాదాపు మూడు గంటల పాటు థియేటర్లలో ప్రసారమవుతుంది. రషెస్ చూసుకుంటే మరో 20 నిమిషాల పాటు ఎక్కువగా ఉందని చెప్పాలి. మొత్తానికి ఈ సినిమా ఓవరాల్ గా మూడున్నర గంట పాటు ఉందని చెప్పాలి. అయితే ప్రస్తుతం సీక్వెల్ సినిమాలు నడుస్తున్న ఈ తరుణంలో ఆది పురుష్ సినిమాని కూడా రెండు భాగాలుగా చేయాలని డైరెక్టర్ ఓం రౌత్ భావించారట.మరో నెలరోజుల పాటు షూటింగ్ చేస్తే రెండో భాగం కూడా విడుదల చేయవచ్చని డైరెక్టర్ చెబితే ప్రభాస్ మాత్రం అందుకు ఒప్పుకోలేదని తెలుస్తుంది.

 

రెండు భాగాలుగా సినిమాలు చేయడం అన్ని సినిమాలకు వర్కౌట్ కాదని ముఖ్యంగా ఇలాంటి సినిమాలకు ఏమాత్రం వర్కౌట్ కాదని తెలియజేశారట ప్రస్తుతం తనకు ఇతర సినిమా షూటింగులు ఉన్నాయని, కాల్ షీట్స్ కూడా తన వద్ద ఏమాత్రం లేవని చెప్పడంతో ఈ ఆలోచనను డైరెక్టర్ విరమించుకున్నారు. లేకపోతే రెండవ భాగం కూడా ప్రేక్షకుల ముందుకు వచ్చినప్పటికీ పూర్తిస్థాయిలో నష్టాలను ఎదుర్కోవాల్సి వచ్చేదని ప్రభాస్ కారణంగానే పెద్ద ఎత్తున నష్టాలు తప్పిపోయాయని తెలుస్తోంది.

Related Articles

ట్రేండింగ్

CM Jagan: చిరు జీవులకు సైతం అన్యాయం చేసిన జగన్ సర్కార్.. మరీ ఇంతలా మోసమా?

CM Jagan: జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత పెద్ద ఎత్తున రాష్ట్రంలో అవినీతి అక్రమాలు జరుగుతున్నాయి. పెద్ద ఎత్తున దోపిడీలు చేస్తున్నారు వైకాపా నేతలు కొండలను గుట్టలను చెరువులను వదలలేదు పెద్ద...
- Advertisement -
- Advertisement -