Tollywood Heroines: స్కిన్ షో చేయకుండానే స్టార్ హీరోయిన్గా ఎదిగిన వాళ్ళు ఎవరంటే?

Tollywood Heroines: ప్రస్తుతం టాలీవుడ్ ఇండస్ట్రీలో ఒకప్పటిలాగా హీరోయిన్లు ట్రెడిషనల్ గా ఉండడం లేదు. ఎవరికివారు గ్లామర్ రోల్స్ చేస్తూ.. ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నారు. ఇక ప్రస్తుత ప్రేక్షకులు కూడా స్కిన్ షో చేసే హీరోయిన్ల సినిమాలనే చూడ్డానికి ఆసక్తి చూపుతున్నారు. మరి డైరెక్టర్లు కూడా అలాంటి స్కిన్ షో చేసే హీరోయిన్లను తీసుకోవడానికి ఇష్టపడుతున్నారు.

కానీ ఇదివరకు సౌందర్య నుంచి ఇప్పటి సాయి పల్లవి వరకు కొంతమంది హీరోయిన్లు ఎప్పుడు గ్లామర్ షో చేయలేదు. అంతేకాకుండా వారు స్కిన్ షో కూడా ఎప్పుడు చేయకుండా స్టార్ హీరోయిన్ స్థాయిలో గుర్తింపు సంపాదించుకున్నారు. మనం ఇప్పుడు ఆ హీరోయిన్ల వివరాలు తెలుసుకుందాం.

సౌందర్య: తెలుగు ఇండస్ట్రీలో అటు తమిళ ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్ స్థాయికి ఎదిగింది సౌందర్య. ఎన్నో అద్భుతమైన చిత్రాలహిట్లను తన సొంతం చేసుకొని ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంది. స్టార్ హీరోయిన్ కి ఏమాత్రం తీసి పోనీ సమంత అప్పట్లో గ్లామర్ షో చేయలేదు. మొత్తం చీరకట్టుతోనే తన అందంతో తెలుగు ప్రేక్షకులను మెప్పించింది ఈ అమ్మడు.

జయసుధ: ఈమె గురించి మీకు పెద్దగా పరిచయం అక్కర్లేదు. ఎన్టీఆర్, ఏఎన్నార్ వంటి మొదటి తరం హీరోల సరసన నటించిన నటిగా ఒక మంచి గుర్తింపు సంపాదించుకుంది. ఆమె 90% సినిమాల్లో చీర కట్టుకొని కనిపిస్తుంది. ఈ చీర కట్టు తోనే అప్పట్లో స్టార్ గా ఒక రేంజ్ లో గుర్తింపు సంపాదించుకుంది జయసుధ.

సుహాసిని: నటి సుహాసిని గురించి మీకు పెద్దగా పరిచయం అక్కర్లేదు. సుహాసిని తెరపై కనిపిస్తే మన ఇంట్లో అమ్మాయిలా అనిపిస్తుంది. అలాంటి సుహాసిని చాలా సినిమాల్లో చీర కట్టుతోనే హీరోయిన్ గా మెప్పించింది.

స్నేహ: స్నేహ కూడా గ్లామర్ రోల్స్ కి దూరంగా ఉందని చెప్పవచ్చు. తను ఏ సినిమాలో కూడా స్కిన్ షో చేయలేదు. తను చేసిన ప్రతి సినిమాలో చీర కట్టుతోనే కనిపించి. తన ప్రత్యేకమైన అందంతో ఎంతోమంది అభిమానులు ఆకట్టుకుంది.

ఇక ఇదే క్రమంలో ఇప్పటి హీరోయిన్ సాయి పల్లవి గురించి మనందరికీ తెలిసిందే. ప్రస్తుతం స్టార్ హీరోయిన్ స్థాయిలో లో గుర్తింపు సంపాదించుకుంది. సాయి పల్లవి నటిస్తే మన పక్కింట్లో అమ్మాయి నటించినట్లు అనిపిస్తుంది. అలాంటి ఈ అందాల భామ.. ఎప్పుడు గ్లామర్ షో చేయలేదు. సహజంగానే తన అందంతో తెలుగు ప్రేక్షకులను ఆకట్టుకుంది.

Related Articles

ట్రేండింగ్

Chandrababu Naidu: చంద్రబాబు నాయుడు రెండో సంతకం ఆ ఫైలుపైనే.. ఆ యాక్ట్ ను రద్దు చేయనున్నారా?

Chandrababu Naidu: ఎన్నికల ప్రచారంలో భాగంగా చంద్రబాబు నాయుడు ప్రకాశం జిల్లాలోని చీరాలలో నిర్వహించిన ప్రజాగళం సభలో మాట్లాడారు. తాము అధికారంలోకి వస్తే చేయబోయే కార్యకలాపాల గురించి ఆ సభలో మాట్లాడారు. అధికారంలోకి...
- Advertisement -
- Advertisement -