Nizamabad: నాలుగేళ్ల ప్రేమ తర్వాత నో చెప్పిన యువకుడు.. యువతి నిర్ణయం ఇదే!

Nizamabad: ప్రస్తుత కాలంలో యువతీ యువకుల మధ్య ప్రేమ ఎంత తొందరగా పుడుతుందో ఆ ప్రేమ అంతే తొందరగా సమాధి అవుతుంది అయితే కొందరు ఈ విషయాన్ని మర్చిపోయి జీవితంలో ముందుకు వెళ్ళగా మరి కొందరు మాత్రం పిచ్చిపిచ్చి ఆలోచనలు చేస్తూ ఆత్మహత్యలు చేసుకోవడం లేదా హత్యలు చేయడం జరుగుతుంది ఇలా ప్రేమలో మోసపోయానని తెలిసినటువంటి ఓ యువతి ఆత్మహత్య చేసుకున్న ఘటన నిజామాబాద్ జిల్లాలో చోటుచేసుకుంది. పూర్తి వివరాలలోకి వెళ్తే…

నిజామాబాద్ జిల్లా మానిక్ బండార్ తండాకు చెందిన కెలోత్ రాజేశ్వరి(19)కి.. అదే గ్రామానికి చెందిన అభిలాష్ అనే యువకుడితో పరిచయం ఏర్పడింది. ఆ పరిచయంకాస్త ప్రేమగా మారింది. ఇలా నాలుగు సంవత్సరాలుగా ఇద్దరు ప్రేమించుకుంటూ ఉన్నారు ఇద్దరు పెళ్లికూడా చేసుకోవాలని భావించారు అయితే పెళ్లి చేసుకోవాలంటే కాస్త డబ్బు ఉండాలని భావించిన రాజేశ్వరి హైదరాబాద్ వచ్చి ఒక నగల దుకాణంలో పని చేస్తున్నారు.

 

ఇలా రాజేశ్వరి హైదరాబాద్ రావడంతో అభిలాష్ తనకు దూరమయ్యారు దీంతో అభిలాష్ ఆలోచనలలో మార్పులు వచ్చాయి. దీంతో రాజేశ్వరిని దూరం పెడుతూ మరొక అమ్మాయికి దగ్గరయ్యారు హైదరాబాదులో ఉన్నటువంటి రాజేశ్వరి తరచూ తన ప్రియుడికి ఫోన్ చేసిన కాల్ వెయిటింగ్ వచ్చేది తిరిగి తనకు ఫోన్ చేసేవారు కాదు ఒకవేళ ఫోన్ లిఫ్ట్ చేసిన తనకి ఇతరులతో సంబంధం అంట గట్టి తనని తిట్టేవారు.

 

ఈ విధంగా తన ప్రియుడు తనని దూరం పెడుతున్నాడని గమనించిన రాజేశ్వరి స్వగ్రామానికి తిరిగి వచ్చి తన గురించి ఆరా తీయగా అభిలాష్ మరొక అమ్మాయితో చనువుగా ఉంటున్నారని తెలిసి తనని నిలదీసింది దీంతో అభిలాష్ నేను తననే పెళ్లి చేసుకుంటాను నీకు నాకు ఎలాంటి సంబంధం లేదని తెగేసి చెప్పారట దీంతో మన స్థాపం చెందిన రాజేశ్వరి గడ్డి మందు తాగి ఆత్మహత్య చేసుకుంది.

Related Articles

ట్రేండింగ్

Chandrababu Naidu: చంద్రబాబు నాయుడు రెండో సంతకం ఆ ఫైలుపైనే.. ఆ యాక్ట్ ను రద్దు చేయనున్నారా?

Chandrababu Naidu: ఎన్నికల ప్రచారంలో భాగంగా చంద్రబాబు నాయుడు ప్రకాశం జిల్లాలోని చీరాలలో నిర్వహించిన ప్రజాగళం సభలో మాట్లాడారు. తాము అధికారంలోకి వస్తే చేయబోయే కార్యకలాపాల గురించి ఆ సభలో మాట్లాడారు. అధికారంలోకి...
- Advertisement -
- Advertisement -