Balayya: టాలీవుడ్ లో బాలయ్య మాత్రమే అలా చేయగలరా.. ఎవరికీ చేత కాదంటూ?

Balayya: రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలకు టాలీవుడ్ నందమూరి నటసింహం హీరో బాలకృష్ణ గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. బాలయ్య బాబు ఈ వయసులో కూడా అదే ఊపుతో సినిమాలలో నటిస్తూ బిజీ బిజీగా గడుపుతున్న విషయం తెలిసిందే. కాగా ఈ ఏడాది ఆరంభంలో వీర సింహారెడ్డి సినిమాతో ప్రేక్షకులను పలకరించిన బాలయ్య బాబు ప్రస్తుతం తదుపరి సినిమా భగవత్ కేసరి సినిమా షూటింగ్ లో భాగంగా బిజీ బిజీగా ఉన్నారు. ఒక వైపు సినిమాలలో నటిస్తూనే మరొకవైపు రాజకీయాలలో యాక్టివ్గా పాల్గొంటున్నారు.

బాలయ్య బాబుకు సినిమాల పట్ల ఉన్న డెడికేషన్ గురించి మనందరికీ తెలిసిందే. సినిమా కోసం ఎంత కష్టపడతారో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. కష్టమైన సన్నివేశాల్లో సైతం డూప్ లేకుండా నటించే హీరోగా బాలయ్యకు పేరుంది. భైరవద్వీపం సినిమా షూట్ సమయంలో కురూపి వేషంలో ఉండటంతో పదిరోజుల పాటు మేకప్ విషయంలో ఇబ్బంది కలగకూడదని బాలయ్య భోజనానికి దూరంగా ఉన్నారట. బాలయ్య డెడికేషన్ ఇదీ అని అప్పట్లోనే దర్శకులు బాలయ్య గొప్పదనం గురించి తెలిపారు. తాజాగా హైదరాబాద్ లో భారీ స్థాయిలో వర్షాలు కురిసిన సంగతి తెలిసిందే. అయితే ఆ సమయంలో కూడా షూటింగ్ లో పాల్గొని బాలయ్య తన డెడికేషన్ ను ప్రూవ్ చేసుకున్నారు.

 

దర్శకుల హీరోగా బాలయ్య ప్రశంసలను అందుకుంటున్నారు. సినిమా సినిమాకు బాలయ్య మార్కెట్ పెరుగుతోంది. అఖండ, వీరసింహారెడ్డి సినిమాలు ఒక సినిమాను మించి మరొకటి కలెక్షన్ లను సాధించాయి. భగవంత్ కేసరి ఈ సినిమాలను మించి సక్సెస్ సాధిస్తుందని అభిమానులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. బాలయ్య త్వరలో బాబీ డైరెక్షన్ లో ఒక సినిమాలో నటించనున్నారు. ఈ సినిమా పీరియడికల్ బ్యాక్ డ్రాప్ లో సరికొత్తగా ఉండనుందని తెలుస్తోంది. బాలయ్య ఈ సినిమాతో భారీ విజయాన్ని సొంతం చేసుకోవాలని ఫ్యాన్స్ భావిస్తున్నారు. స్టార్ హీరో బాలకృష్ణ బాక్సాఫీస్ ను షేక్ చేసే సినిమాలలో నటించాలని ఫ్యాన్స్ భావిస్తున్నారు. పాన్ ఇండియా సినిమాలలో, మల్టీస్టారర్ సినిమాలలో బాలయ్య నటిస్తే బాలయ్య రేంజ్ మరింత పెరిగే అవకాశాలు అయితే ఉంటాయి. మాస్ మసాలా సినిమాలలో బాలయ్య నటిస్తున్న నేపథ్యంలో బాలయ్య సినిమాలు రాబోయే రోజుల్లో బాలయ్య సరికొత్త రికార్డులు క్రియేట్ చేస్తారని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

Related Articles

ట్రేండింగ్

Chandrababu Naidu: చంద్రబాబు నాయుడు రెండో సంతకం ఆ ఫైలుపైనే.. ఆ యాక్ట్ ను రద్దు చేయనున్నారా?

Chandrababu Naidu: ఎన్నికల ప్రచారంలో భాగంగా చంద్రబాబు నాయుడు ప్రకాశం జిల్లాలోని చీరాలలో నిర్వహించిన ప్రజాగళం సభలో మాట్లాడారు. తాము అధికారంలోకి వస్తే చేయబోయే కార్యకలాపాల గురించి ఆ సభలో మాట్లాడారు. అధికారంలోకి...
- Advertisement -
- Advertisement -