Sandeep Reddy Vanga: బాలీవుడ్ సినిమా గురించి సందీప్ వంగా సంచలన వ్యాఖ్యలు.. ఏమన్నారంటే?

Sandeep Reddy Vanga: దర్శకుడు సందీప్ రెడ్డి వంగ ఇటీవల యానిమల్ సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చిన సంగతి తెలిసిందే. రణబీర్ కపూర్ రష్మిక హీరో హీరోయిన్లుగా నటించిన ఈ సినిమా డిసెంబర్ ఒకటవ తేదీ ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ సినిమా విడుదలైన అనంతరం ఎంతో మంచి ఆదరణ సొంతం చేసుకోగా మరికొందరు ఈ సినిమా పట్ల విమర్శల వర్షం కురిపించారు.

 

ఈ సినిమాలో స్త్రీలను కించపరిచే విధంగా ఉందని అలాగే పురుషాధిక్యత ఎక్కువగా ఉంది అంటూ చాలామంది ఈ సినిమాపై విమర్శల వర్షం కురిపించారు. ఇక ఈ సినిమా గురించి ప్రముఖ రచయిత జావేద్ అక్తర్ చేసినటువంటి కామెంట్స్ కూడా పెద్ద ఎత్తున వైరల్ అయ్యాయి. ఒక పురుషుడు స్త్రీని తన షూ నాకమని చెప్పినప్పుడు లేదా ఒక వ్యక్తి స్త్రీని చెంపదెబ్బ కొట్టడానికి ఓకే చెప్పిన ఆ సినిమా సూపర్ హిట్ అయితే అది ఎంతో ప్రమాదకరం అని ఈయన యానిమల్ సినిమాపై కామెంట్లు చేశారు.

ఇక ఈ కామెంట్ల పై తాజాగా సందీప్ రెడ్డి స్పందించి రచయిత జావేద్ కి కౌంటర్ ఇచ్చారు. రచయిత జావేద్ ఈ కామెంట్లు చేసినప్పుడు స్పష్టంగా అర్థం అవుతుంది ఆయన పూర్తి సినిమా చూడలేదని ఇలా ఒక సినిమా గురించి విమర్శలు చేసేటప్పుడు తమ పరిసరాలను తమ పరిస్థితులను ఎందుకు గమనించరు అంటూ ఈయన మాట్లాడారు.

 

ఇప్పుడు నా సినిమాపై వేలెత్తి చూపిస్తున్నటువంటి ఆయన తన కొడుకు ఫర్హాన్ అక్తర్ మీర్జాపూర్ సినిమా చేస్తున్నప్పుడు ఎందుకు చెప్పలేదని ప్రశ్నించారు. ఈ ప్రపంచంలో ఉన్న బూతు పదాలన్నీ కూడా ఈ సినిమాలోనే ఉన్నాయని ఈ సినిమాని నేను తెలుగులో వచ్చిన తర్వాత చూసి ఆ బూతు పదాలు వినలేక మధ్యలోనే వదిలేసానని ఈ సందర్భంగా తన స్టైల్ లో సందీప్ రెడ్డి రచయిత జావేద్ అక్తర్ కి కౌంటర్ ఇచ్చారు.

Related Articles

ట్రేండింగ్

Chandrababu Naidu: చంద్రబాబు నాయుడు రెండో సంతకం ఆ ఫైలుపైనే.. ఆ యాక్ట్ ను రద్దు చేయనున్నారా?

Chandrababu Naidu: ఎన్నికల ప్రచారంలో భాగంగా చంద్రబాబు నాయుడు ప్రకాశం జిల్లాలోని చీరాలలో నిర్వహించిన ప్రజాగళం సభలో మాట్లాడారు. తాము అధికారంలోకి వస్తే చేయబోయే కార్యకలాపాల గురించి ఆ సభలో మాట్లాడారు. అధికారంలోకి...
- Advertisement -
- Advertisement -