Kiran Kumar Reddy: కాళ్లు పట్టుకోవడంలో పెద్దిరెడ్డి ఎక్స్‌పర్ట్.. కిరణ్ కుమార్ రెడ్ది సంచలన వ్యాఖ్యలు వైరల్!

Kiran Kumar Reddy: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాలలో కిరణ్ కుమార్ రెడ్డి అలాగే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి మధ్య ఉన్నటువంటి సాన్నిహిత్యం గురించి అందరికీ తెలిసిందే. పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి రాజకీయాలలో నేడు ఈ స్థాయిలో ఉన్నారు అంటే కిరణ్ కుమార్ రెడ్డి సహాయ సహకారాలు ఉన్నాయని చెప్పాలి. ఇలా తన సహాయంతో రాజకీయాలలో ఎదిగినటువంటి కిరణ్ కుమార్ రెడ్డి ఇలా తన సహాయంతో రాజకీయాలలో ఎదిగినటువంటి పెద్దిరెడ్డి నేడు కిరణ్ కుమార్ రెడ్డిని విమర్శించే స్థాయికి చేరారు.

ఇలా తన పట్ల తీవ్ర స్థాయిలో పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి విమర్శలు చేయడంతో కిరణ్ కుమార్ రెడ్డి పెద్దిరెడ్డి రాజకీయ బాగోతాన్ని మొత్తం బయటపెట్టారు. రాజకీయ ఎదుగుదల కోసం పెద్దిరెడ్డికి కాళ్లు పట్టుకోవడం ఆనవాయితీ అంటూ ఈయన విమర్శలు చేశారు.ఓ సారి డీసీసీ అధ్యక్ష ఎన్నిక ప్రక్రియ జరుగుతున్నప్పుడు కిరణ్ దగ్గరకు వెళ్లి రాత్రి పదకొండుగంటలకు కాళ్లు పట్టుకుని తనను డీసీసీ అధ్యక్షుడ్ని చేసేలా సహకరించాలని కోరారు.

మళ్లీ తాగేసి వచ్చి పట్టుకున్నా అని అనుకుంటాడేమోని.. పొద్దున్నే వచ్చి మరి కూడా తన కాళ్లు పట్టుకున్నారని కిరణ్ కుమార్ రెడ్డి తెలిపారు. అయితే ఈ విషయాలన్నీ చెప్పడం తనకు ఇష్టం లేకపోయినా ఆయన తన పట్ల విమర్శలు చేయటం వల్లే చెప్పాల్సి వచ్చిందని తెలిపారు.పెద్దిరెడ్డి బతుకంతా కాళ్లు పట్టుకుని పైకొచ్చి… అలా సాయం చేసిన వారి కాళ్లు లాగేసే ప్రయత్నం చేసిన బాపతేనని చిత్తూరు జిల్లాలో చెప్పుకుంటారు.

ఒకసారి ఈయన దివాలా తీసే పరిస్థితులలో ఉంటే చంద్రబాబు నాయుడు సహాయ సహకారాలతో బయటపడే రాజకీయంగా ఎదిగారని తెలిపారు. ఇలా అందరూ సహాయ సహకారాలతో కాలు పట్టుకుంటూ రాజకీయంగా పైకి వచ్చినటువంటి పెద్ది రెడ్డి నేడు అందరి పట్ల విమర్శలు చేయడం భావ్యం కాదంటూ కిరణ్ కుమార్ రెడ్డి ఆయన పట్ల విమర్శలు చేశారు.

Related Articles

ట్రేండింగ్

Chandrababu Naidu: చంద్రబాబు నాయుడు రెండో సంతకం ఆ ఫైలుపైనే.. ఆ యాక్ట్ ను రద్దు చేయనున్నారా?

Chandrababu Naidu: ఎన్నికల ప్రచారంలో భాగంగా చంద్రబాబు నాయుడు ప్రకాశం జిల్లాలోని చీరాలలో నిర్వహించిన ప్రజాగళం సభలో మాట్లాడారు. తాము అధికారంలోకి వస్తే చేయబోయే కార్యకలాపాల గురించి ఆ సభలో మాట్లాడారు. అధికారంలోకి...
- Advertisement -
- Advertisement -