Vizag: ఆంధ్రప్రదేశ్లో ఎన్నికలు దగ్గర పడుతున్నటువంటి నేపథ్యంలో ప్రతి ఒక్కరు కూడా ఎన్నికలపై దృష్టి పెట్టడమే కాకుండా వారు ఏ స్థానంలో నిలబడాలి. ఎక్కడ టిక్కెట్టు తీసుకోవాలని అన్న విషయంపై కూడా ఆసక్తి చూపుతున్నట్లు తెలుస్తుంది. అయితే ఆంధ్రప్రదేశ్ కి ప్రధాన నగరమైనటువంటి వైజాగ్ ఎంపీ సీటుపై అందరి నేతల కన్ను పడిందని చెప్పాలి. వైజాగ్ కేంద్రంగా తెలుగుదేశం పార్టీ నేతల వ్యాపారాలు భారీగానే ఉన్నాయి అయితే వైసిపి ప్రభుత్వం అధికారంలోకి రావడంతో ఈ వ్యాపారాలని పూర్తిగా దెబ్బతిన్నాయి.
తిరిగి తమ వ్యాపారాలు పుంజు కోవాలి అంటే వైజాగ్లో ఎంపీగా గెలిస్తేనే తమ వ్యాపారాలు పుంజుకుంటాయని లేకపోతే ఇబ్బందులలో పడాల్సి వస్తుంది అంటూ ప్రతి ఒక్క పార్టీ నుంచి కూడా వైజాగ్ పోటీ చేసే నాయకుల పట్ల తీవ్ర ఉత్కంఠత నెలకొంది. భాజపాలోకి అడుగుపెట్టినటువంటి పురందేశ్వరి వైజాగ్ ఎంపీగా పోటీ చేయాలని ఎన్నో ఆశలు పెట్టుకున్నారు. అదే తరుణంలో తెలుగుదేశం పార్టీ నుంచి బాలకృష్ణ చిన్నల్లుడు భరత్ కూడా పోటీకి సై అంటున్నారు.
మరోవైపు జనసేన పార్టీ నుంచి కూడా పవన్ కళ్యాణ్ వైజాగ్ నుంచి ఎంపీగా పోటీ చేసి గెలిస్తే తనకు మంత్రి పదవి తక్కుతుందని ఆలోచనలో ఉన్నట్టు తెలుస్తుంది. ఈ క్రమంలోనే పవన్ కళ్యాణ్ కూడా ఎంపీగా ఇక్కడి నుంచి పోటీ చేయాలన్న ఆలోచనలో ఉన్నారని సమాచారం. ఇక వైఎస్ఆర్సిపి పార్టీ నుంచి ప్రస్తుతం వైజాగ్ ఎంపీగా విజయసాయిరెడ్డి కొనసాగుతున్న విషయం మనకు తెలిసిందే.
ఇలా వచ్చే ఎన్నికలలో విజయసాయిరెడ్డి ఈ రాజకీయాల నుంచి తప్పుకొని తన అల్లుడిని వైజాగ్ ఎంపీగా రంగంలోకి దింపబోతున్నట్టు తెలుస్తుంది.ఏది ఏమైనా వైజాగ్ ఎంపీ సీటు గురించి ప్రస్తుతం అందరిలోనూ ఉత్కంఠత కొనసాగుతుంది. మరి వైజాగ్ ఎంపీ పార్టీ నుంచి ఎవరు పోటీ చేయబోతున్నారు ఎవరు అధికారం అందుకోబోతున్నారు అనేది తెలియాల్సి ఉంది.