YCP Leaders: ఏపీ అసెంబ్లీ ఎన్నికలు దగ్గర పడుతున్నటువంటి తరుణంలో ఎలాగైనా వచ్చే ఎన్నికలలో విజయం సాధించాలనే దిశగా వైసిపి నేతలు ఎన్నో అడ్డదారులు తొక్కుతున్నారు. ఇప్పటికే ప్రజలను ప్రలోభ పెట్టడం కోసం ఎన్నో రకాల కానుకలను అందజేస్తూ ఓట్లు వేయాలంటూ అభ్యర్థిస్తున్నారు. గ్రామ వార్డు సచివాలయ వాలంటీర్ల ద్వారా ప్రతి ఒక్క ఇంటికి కానుకలు అందేలా చర్యలు తీసుకుంటున్నారు.
ఇకపోతే తాజాగా విశాఖ ఉత్తర నియోజకవర్గ వైకాపా ఇంఛార్జ్ కేకే రాజు సోమవారం అక్కయ్యపాలెంలో ఆటో కార్మికులతో పాటు పద్మశాలి కమిటీ సభ్యులతో వేరువేరుగా మీట్ అయ్యారు. ఇలా వీరందరికీ రాజు 1500 రూపాయలు విలువచేసే ఖరీదైన వస్త్రాలను కానుకలుగా అందజేశారు.
ఇక భీమిలిలో ఐసిడిసి అధికారులు మీటింగ్ పేరిట అంగన్వాడి కార్యకర్తలను అవంతి కళాశాలకు ఆహ్వానించారు. అనంతరం అక్కడ వైకాపా మంత్రి అంగన్వాడి కార్యకర్తలను ఉద్దేశించి మాట్లాడుతూ వచ్చే ఎన్నికలలో తమ ప్రభుత్వం ఏర్పాటుకు సహకరించాలని కోరారు. ఇలా అంగన్వాడి కార్యకర్తలను అభ్యర్థించిన ముత్తంశెట్టి శ్రీనివాసరావు అనంతరం అంగన్వాడి ఉద్యోగులందరికీ చీరలను కానుకలుగా పంపిణీ చేశారు.
ఇలా ఒకచోట మాత్రమే కాదు రాష్ట్రవ్యాప్తంగా ప్రతి ఒక్క నియోజకవర్గంలో కూడా ఇప్పటికే ఎన్నికల ప్రచార కార్యక్రమాలను మొదలుపెట్టడమే కాకుండా తమ పార్టీకి ఓట్లు వేయాలి అంటూ పెద్ద ఎత్తున తాయిలాలు అందజేస్తూ ప్రచార కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. ఇలా కానుకలను పంచి ఓట్లు సాధించడం కోసం వైసీపీ నేతలు వాలంటీర్ల ద్వారా పంపిణీ చేయడం గమనార్హం.