Pakistan: పాక్ ప్రియుడిని పెళ్లాడేందుకు యువతికి ఆఫర్ల ఎర.. అసలేం జరిగిందంటే?

Pakistan: అంజూ.. గత కొద్ది రోజులుగా ఈ పేరు దేశవ్యాప్తంగా మారుమోగుతున్న సంగతి మనందరికీ తెలిసిందే. భారతదేశానికి చెందిన ఈమె పాకిస్తాన్ కు చెందిన వ్యక్తిని ప్రేమించిన విషయం తెలిసిందే. అంతేకాకుండా ప్రియుడి కోసం ఎన్నో త్యాగాలు కూడా చేసింది. అయితే తాజాగా ఆమె
పాకిస్థాన్‌ ప్రియుడిని పెళ్లి చేసుకోవడం కోసం ఇస్లాంలోకి మారిన విషయం తెలిసిందే. అయితే ఇస్లాంలోకి మారినందుకుగాను అంజూకు ఒక రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారి కానుకలు అందించారు. సుమారు 2,722 చదరపు అడుగుల భూమికి సంబంధించిన పత్రాలతో పాటుగా ఒక చెక్కును ఆమెకు అందజేశారు.

15 ఏళ్ల కుమార్తె, ఆరేళ్ల కుమారుడు ఉన్న అంజూ ఇటీవల రాజస్థాన్‌ నుంచి పాక్‌కు వెళ్లిన సంగతి తెలిసిందే. ఫేస్‌బుక్‌లో పరిచయమైన నస్రుల్లా అనే 29 ఏళ్ళ వ్యక్తిను ఆమె ఈ నెల 25న పెళ్లి చేసుకుంది. వివాహం కోసం ఇస్లాంలోకి మారి ఫాతిమాగా పేరు మార్చుకుంది. ఖైబర్‌ పఖ్తుంఖ్వా ప్రావిన్సు అప్పర్‌ దిల్‌ జిల్లాలోని ఒక గ్రామంలో వారు నివసిస్తున్నారు. ఒక రియల్‌ ఎస్టేట్‌ సంస్థ సీఈవో అయిన మోసిన్‌ ఖాన్‌ అబ్బాసి శనివారం వారి ఇంటికి వెళ్లారు. అంజూకు భూమి పత్రాలతో పాటు ఒక చెక్కును అందజేశారు. అయితే ఎంత మొత్తానికి ఆ చెక్కు ఇచ్చారన్నది తెలియదు.

 

అంజూ భారత్‌ నుంచి ఇంత దూరం వచ్చి ఇస్లాంలోకి మారి నూతన వైవాహిక జీవితాన్ని ప్రారంభించింది. ఆమెను మా మతంలోకి ఆహ్వానించడంతో పాటు దాంపత్య జీవితానికి శుభాకాంక్షలు తెలిపేందుకు ఇక్కడికి వచ్చాను. ఇస్లాంలోకి మారిన తర్వాత ఆమెకు ఇక్కడ ఎలాంటి ఇబ్బందులు ఎదురుకాకుండా ఉండేందుకే కానుకలు ఇచ్చాను అని అబ్బాసి తెలిపారు. ఈ వార్త ఇప్పుడు దేశవ్యాప్తంగా ఆ వైరల్ గా మారింది. దీంతో అబ్బాయి చేసిన పనికి నెటిజెన్స్ అతనిపై ప్రశంసలు కురిపిస్తున్నారు.

Related Articles

ట్రేండింగ్

Pawan Kalyan: జనసేన పార్టీ నేతలకు కీలక ఆదేశాలు ఇచ్చిన పవన్ కళ్యాణ్.. ఆ నేతలు పాటిస్తారా?

Pawan Kalyan:  పవన్ కళ్యాణ్ లో ఇప్పుడు పరిపూర్ణ రాజకీయ నాయకుడు కనిపిస్తున్నాడు. పార్టీకి సంబంధించి అనేకమైన కీలక నిర్ణయాలను చాలా పరిణితితో తీసుకుంటున్నారు. పోలింగ్ రెండు వారాల్లో ఉంది కాబట్టి ఈ...
- Advertisement -
- Advertisement -