Actress Soundarya: చనిపోక ముందు సౌందర్య తీర్చుకోవాలనుకున్న కోరికలు ఇవే!

Actress Soundarya: టాలీవుడ్ ప్రేక్షకులకు అప్పటి అందాల తర సౌందర్య గురించి పెద్దగా పరిచయం అక్కర్లేదు. తమిళ, తెలుగు, కన్నడ, మలయాళం భాషల్లో 100కు పైగా సినిమాల్లో నటించి నటిగా తనకంటూ ఒక చక్కని గుర్తింపు సొంతం చేసుకుంది. ఇక సౌందర్య తన అందంతో ఎంతో మంది అభిమానులను తన సొంతం చేసుకుంది. తన చక్కని చీర కట్టుతో తెలుగింటి ఆడపడుచులా కనిపిస్తుంది.

అప్పట్లో చాలామంది స్టార్ హీరోలను సరసన నటించి స్టార్ హీరోయిన్ స్థాయికి ఎదిగింది ఈ అమ్మడు. ఇక సౌందర్య సినిమాల్లోనే కాకుండా రాజకీయాల్లో కూడా అడుగుపెట్టి అప్పట్లో బీజేపీ తరుపున ప్రచారం చేసింది. ఈ క్రమంలో రాజకీయంగా కూడా ఈ అమ్మడు కొంత ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకుంది. ఇలా ఒకప్పుడు టాలీవుడ్ ఇండస్ట్రీలో ఓ వెలుగు వెలిగిన సౌందర్య సినీ ఇండస్ట్రీకి తీరని లోటుని ఇచ్చి వెళ్లింది.

బెంగళూరులో జరిగిన విమాన ప్రమాదంలో సౌందర్య ఎవరు ఊహించని విధంగా చనిపోయింది. ఈ విషయాన్ని అప్పటి సినీ ఇండస్ట్రీ వర్గాలు, రాజకీయ వర్గాలు ఏమాత్రం జీర్ణించుకోలేకపోయాయి. ఇక సౌందర్య మరణ వార్త విని తన అభిమానులు కన్నీటి శోకంలో మునిగిపోయారు. ఇంకా చెప్పాలంటే ఇప్పటివరకు కూడా సౌందర్య అభిమానులకు తను గుర్తుకు వస్తే కొంచెం కంటతడి పెట్టక తప్పదు.

ఎందుకంటే ఇండస్ట్రీలో తన అందంతో, అభినయంతో ఆ రేంజ్ లో హడావిడి చేసింది ఈ అమ్మడు. అటువంటి సౌందర్య చనిపోక ముందు రెండు ఆశయాలను నెరవేర్చుకోకుండా చనిపోయింది. సినీ ఇండస్ట్రీలో ఉన్నత శిఖరాలను అందుకున్న సౌందర్య హాలీవుడ్ సినిమాలను నిర్మించాలని అనుకున్నారట. ఇక రాజకీయాల్లో కూడా ఒక వెలుగు వెలగాలని అనుకుందట. కానీ దురదృష్టవం శాత్తు తనతోపాటు తన ఆశలు కూడా బూడిద అయిపోయాయి. మరి అప్పట్లో బీజేపీ తరఫున ప్రచారం చేసిన సౌందర్య చనిపోకుండా ఉంటే నిజంగానే రాజకీయాల్లో ఓ వెలుగు వెలిగేదని తన అభిమానులు చెప్పుకుంటున్నారు.

Related Articles

ట్రేండింగ్

Chandrababu Naidu: చంద్రబాబు నాయుడు రెండో సంతకం ఆ ఫైలుపైనే.. ఆ యాక్ట్ ను రద్దు చేయనున్నారా?

Chandrababu Naidu: ఎన్నికల ప్రచారంలో భాగంగా చంద్రబాబు నాయుడు ప్రకాశం జిల్లాలోని చీరాలలో నిర్వహించిన ప్రజాగళం సభలో మాట్లాడారు. తాము అధికారంలోకి వస్తే చేయబోయే కార్యకలాపాల గురించి ఆ సభలో మాట్లాడారు. అధికారంలోకి...
- Advertisement -
- Advertisement -