Kodi Kathi Srinu Mother: కోడి కత్తి శీను గురించి మనందరికీ తెలిసిందే. ఏపీ ప్రజలకు ఈ పేరు బాగా సుపరిచితమే. అయితే కోడి కత్తి శీను దాదాపు ఐదేళ్లుగా జైల్లో శిక్షణ అనుభవిస్తున్న విషయం తెలిసిందే. తాజాగా ఇదే విషయం గురించి స్పందిస్తూ కోడి కత్తి శీను తల్లి ఆవేదన వ్యక్తం చేసింది. కోడికత్తి కేసులో తన కుమారుడు సుమారు ఐదేళ్లుగా జైల్లో మగ్గిపోతున్నాడని నిందితుడు శ్రీనివాసరావు తల్లి సావిత్రి ఆవేదన వ్యక్తం చేశారు. అతడికి ఏమవుతుందోనని భయంగా ఉందని కన్నీరు పెట్టుకుంది.
తాజాగా విజయవాడలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆమె మాట్లాడుతూ… విశాఖ జైలులో గురువారం నుంచి నిరాహారదీక్ష చేయనున్నట్లు శ్రీనివాసరావు తమకు చెప్పినట్లు తెలిపారు. తమకు న్యాయం చేయాలని సావిత్రి కోరారు. నిందితుడు దళితుడు కాబట్టే ఇప్పటివరకు న్యాయం జరగలేదని అతడి సోదరుడు సుబ్బరాజు కూడా ఆవేదన వ్యక్తం చేశారు. సాక్ష్యం చెప్పేందుకు సీఎం జగన్ కోర్టుకు రావడం లేదన్నారు. అంతే కాకుండా సీఎం మా జిల్లాకు వస్తే ఒక రోజు ముందే మమ్మల్ని అరెస్ట్ చేస్తున్నారు.
శ్రీను ఫోన్ చేసి జైలులో నిరాహార దీక్ష చేపడుతున్నట్లు తెలిపాడు. మా కుటుంబం కూడా విజయవాడలో దీక్ష చేపడుతుంది. గురువారం దుర్గమ్మ దర్శనం చేసుకుని దీక్షకు కూర్చుంటాం అని తెలిపారు కత్తి శీను సోదరుడు సుబ్బరాజు. ఈ సందర్భంగా కత్తి శీను తల్లి చేసిన వాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. మరి ఇప్పటికైనా ప్రభుత్వం వీరి విషయంలో కనికరం చూపుతుందో లేదో చూడాలి మరి