Agent: ఏజెంట్ మూవీకి అఖిల్ కు రూపాయి కూడా ఇవ్వరా.. ఏమైందంటే?

Agent: టాలీవుడ్ యంగ్ హీరో అఖిల్ అక్కినేని గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. నాగార్జున తనయుడిగా సినిమా ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన అఖిల్ సరైన హిట్టు కోసం ఎప్పటి నుంచో ఎదురుచూస్తున్నప్పటికీ సక్సెస్ ను సాధించలేకపోతున్నాడు. 2021 లో విడుదల అయిన మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ సినిమా పర్వాలేదు అనిపించేలా హిట్ టాక్ ని సొంతం చేసుకుంది. ఇకపోతే అఖిల్ ప్రస్తుతం తాజాగా నటించిన సినిమా ఏజెంట్. అఖిల్ కెరియర్ లోని హైయెస్ట్ బడ్జెట్ అలాగే పాన్ ఇండియా లెవెల్లో ఈ సినిమా తెరకెక్కబోతున్న ఎక్కబోతున్న సంగతి మనందరికీ తెలిసిందే.

ఈ సినిమాకు సురేందర్ రెడ్డి దర్శకత్వం వహించిన విషయం తెలిసిందే. ఇందులో మమ్ముట్టి కీలకపాత్రలో నటిస్తున్నారు. ఇక ఇందులో అఖిల్ సరసన సాక్షి వైద్య హీరోయిన్ గా నటిస్తోంది. ఈ సినిమాను ఏకే ఎంటర్టైన్మెంట్ బ్యానర్ పై అనిల్ సుంకర నిర్మిస్తున్నారు. ఈ సినిమా ఏప్రిల్ 28న ప్రేక్షకుల ముందుకు రానున్న సంగతి మనందరికీ తెలిసిందే. ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన టీజర్ పోస్టర్లకు ప్రేక్షకుల నుంచి భారీగా స్పందన లభించింది. చిత్రం బృందం ప్రస్తుతం ప్రమోషన్స్ లో భాగంగా బిజీబిజీగా గడుపుతున్నారు. విడుదల తేదీకి కేవలం ఒక్కరోజు మాత్రమే సమయం ఉండడంతో ప్రమోషన్స్ ని వేగవంతం చేశారు.

 

తాజాగా ఈ సినిమాకు సంబంధించి ఒక ఆసక్తికర వార్త చక్కర్లు కొడుతోంది. అదేమిటంటే.. ఏజెంట్ సినిమాను రూపొందించడానికి 80 కోట్ల వరకు ఖర్చు అయ్యిందని, అయితే హీరో అఖిల్ దర్శకుడు సురేందర్ రెడ్డి ఈ సినిమాకు రెమ్యూనరేషన్ తీసుకోవడం లేదు అని తెలుస్తోంది. వారిద్దరి రెమ్యూనరేషన్ లేకుండా ఈ సినిమాకు 80 కోట్లు అయిందని ఒకవేళ వారిద్దరూ రెమ్యూనరేషన్ తీసుకొని ఉంటే కచ్చితంగా 100 కోట్లు దాటేది అని తెలుస్తోంది. ఈ సినిమాకు గాను హీరో అఖిల్ కి రెమ్యునరేషన్ గా ఒక్క రూపాయి కూడా తీసుకోలేదని, ఎందుకంటే ఈ సినిమా నిర్మాణంలో హీరో అఖిల్ దర్శకుడు సురేందర్ రెడ్డి వీళ్లిద్దరు కూడా భాగం అయ్యారని అందుకే వాళ్ళిద్దరికీ రెమ్యూనరేషన్ ఇవ్వలేదని తెలుస్తోంది. ఇది ఇలా ఉంటే అక్కినేని అభిమానులు ఈ సినిమా కోసం ఎంతో ఆత్రుతగా ఎదురు చూస్తున్న సంగతి తెలిసిందే. ఆ అంచనాలను మరింత పెంచుతూ తాజాగా ఈ సినిమాలో హీరో రామ్ చరణ్ నటిస్తున్నట్లు తెలపడంతో అంచనాలు మరింత పెరిగాయి.

Related Articles

ట్రేండింగ్

Chandrababu Naidu: చంద్రబాబు నాయుడు రెండో సంతకం ఆ ఫైలుపైనే.. ఆ యాక్ట్ ను రద్దు చేయనున్నారా?

Chandrababu Naidu: ఎన్నికల ప్రచారంలో భాగంగా చంద్రబాబు నాయుడు ప్రకాశం జిల్లాలోని చీరాలలో నిర్వహించిన ప్రజాగళం సభలో మాట్లాడారు. తాము అధికారంలోకి వస్తే చేయబోయే కార్యకలాపాల గురించి ఆ సభలో మాట్లాడారు. అధికారంలోకి...
- Advertisement -
- Advertisement -