Allu Arjun-Ram Charan: ఈ స్టార్ హీరోల మల్టీ స్టారర్ కు ఫ్యామిలీ విభేదాలు కారణమా!

Allu Arjun-Ram Charan: ప్రస్తుతం టాలీవుడ్ లో మల్టీ స్టారర్ సినిమాలా హవా బాగా నడుస్తుంది. డైరెక్టర్లు కూడా మల్టి స్టారర్ సినిమాలు తీయడానికి బాగా ఇంట్రెస్ట్ చూపుతున్నారు. మొత్తానికి టాలీవుడ్ లో మల్టీస్టారర్ సినిమాలు భరిలోకి దిగుతున్నాయి. ఇటీవల రాజమౌళి పాన్ ఇండియా స్థాయిలో ప్రాణం పోసిన త్రిబుల్ ఆర్ సినిమా మనందరికీ తెలిసిందే.

ఇది సినిమా ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంది. అంతేకాకుండా ఎన్టీఆర్ రామ్ చరణ్ లు పాన్ ఇండియా స్టార్లుగా మారిపోయారు. ఇక డైరెక్టర్ కొరటాల శివ దర్శకత్వంలో మల్టీస్టారర్ మూవీగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన సినిమా ఆచార్య. ఈ సినిమాలో మెగాస్టార్ చిరంజీవి హీరోగా నటించాడు. ఇక తన కొడుకు రామ్ చరణ్ ఈ సినిమాలో ఒక మెయిన్ రోల్ చేసాడు.

ఇక ఇదే క్రమంలో ఇటీవల బంగార్రాజు సినిమాతో అక్కినేని ఫ్యామిలీ భరిలోకి దిగింది. ఈ సినిమా ఊహించని స్థాయిలో సక్సెస్ అందుకుంది. తండ్రి కొడుకులు ఇద్దరు ప్రేక్షకులను బాగా ఆకట్టుకున్నారు. మరి అదేవిధంగా బన్నీ, రామ్ చరణ్ లు కలిసి ఒక మల్టీ స్టార్ సినిమా చేయడం కుదురుతుందా అనేది.. గమనించాలి. నిజానికి వీళ్ళిద్దరూ మల్టీ స్టారర్ సినిమాలు చేయడం అసలు కుదరదు.

ఎందుకంటే రామ్ చరణ్ త్రిబుల్ ఆర్ సినిమా ద్వారా పాన్ ఇండియా స్టార్ గా గుర్తింపు తెచ్చుకున్నాడు. ఇక బన్నీ కూడా పుష్ప సినిమా ద్వారా ప్రస్తుతం పాన్ ఇండియా స్టార్ గా హడావిడి చేస్తున్నాడు. దీనిని బట్టి వీళ్లిద్దరూ మల్టీ స్టారర్ సినిమాలు చేయడానికి అసలు ఒప్పుకోరు.

అంతేకాకుండా మెగా ఫ్యామిలీకి.. అల్లు ఫ్యామిలీకి గత కొంతకాలంగా విభేదాలు నడుస్తున్నాయని సోషల్ మీడియాలో వార్తలు జరుగుతున్నాయి. ఈ విభేదాలు కూడా కొంతవరకు మల్టీ స్టారర్ సినిమాలు చేయకపోవడానికి కారణమని తెలుస్తుంది. మరి ఈ విషయంలో అల్లు అర్జున్, రామ్ చరణ్ లు ఏ విధంగా స్పందిస్తారో చూడాలి.

Related Articles

ట్రేండింగ్

Chandrababu Naidu: చంద్రబాబు నాయుడు రెండో సంతకం ఆ ఫైలుపైనే.. ఆ యాక్ట్ ను రద్దు చేయనున్నారా?

Chandrababu Naidu: ఎన్నికల ప్రచారంలో భాగంగా చంద్రబాబు నాయుడు ప్రకాశం జిల్లాలోని చీరాలలో నిర్వహించిన ప్రజాగళం సభలో మాట్లాడారు. తాము అధికారంలోకి వస్తే చేయబోయే కార్యకలాపాల గురించి ఆ సభలో మాట్లాడారు. అధికారంలోకి...
- Advertisement -
- Advertisement -