AP Assembly Session: అసెంబ్లీలో మీసం మెలేసిన బాలయ్య.. అంబటి రియాక్షన్ తెలిస్తే షాకవ్వాల్సిందే!

AP Assembly Session: ఏపీలో అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమైన కాసేపటికే సభలో టీడీపీ నేతలు రెచ్చిపోయారు. చంద్రబాబు అరెస్ట్‌పై చర్చించాలని నినాదాలు చేస్తూ స్పీకర్‌ తమ్మినేని సీతారాం వద్దకు దూసుకెళ్లారు. ఈ క్రమంలో స్పీకర్‌ను చుట్టుముట్టి ఆయనపై పేపర్లు విసిరారు. బాటిళ్లు విసురుతూ అనుచితంగా ప్రవర్తించారు. దీంతో కొద్దిసేపు అసెంబ్లీలో గందరగోల పరిస్థితి నెలకొంది. ఈ నేపథ్యంలో వైసీపీ ఎమ్మెల్యేలు స్పందించారు. ఈ సందర్బంగా ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్‌ మాట్లాడుతూ.. చంద్రబాబు అరెస్ట్‌పై చర్చకు సిద్ధమన్నారు.

బీఏసీలో చర్చించి నిర్ణయం తీసుకుంటామని అన్నారు. అసెంబ్లీలో ఏం అంశంపైనైనా చర్చకు సిద్ధమన్నారు. అలాగే చంద్రబాబు అరెస్ట్‌పై చర్చకు ఎంత సమయమైనా ఇస్తాం అని స్పష్టం చేశారు. అయితే బుగ్గన చెప్పినా టీడీపీ నేతలు పట్టించుకోలేదు. ఈ నేపథ్యంలో మంత్రి అంబటి రాంబాబు టీడీపీ నేతలకు సర్ధిచెప్పే ప్రయత్నం చేశారు. చంద్రబాబు అరెస్ట్‌పై చర్చించేందుకు సిద్ధంగా ఉన్నామని తెలిపారు. కాసేపు ఓపికా పడితే చర్చకు సిద్దమని వెల్లడించారు. దీంతో, మరింత రెచ్చిపోయిన టీడీపీ ఎమ్మెల్యే బాలకృష్ణ అంబటి వైపు చూస్తూ తొడగొట్టి మీసాలు మెలేశారు. ఈ క్రమంలో అంబటి రాంబాబు మాట్లాడుతూ..

టీడీపీ సభ్యులు కావాలనే రెచ్చగొడుతున్నారు. టీడీపీ సభ్యులు అవాంఛనీయ ఘటనలను ఆహ్వనిస్తున్నారు. స్పీకర్‌పై దౌర్జన్యానికి దిగడం సరికాదని అంబటి అన్నారు. టీడీపీ సభ్యులు బల్లలు కొడుతూ ఏం సందేశమిస్తున్నారు. అసెంబ్లీలో మీసాలు తిప్పితే చూస్తే ఊరుకోమని హెచ్చరించారు. ఇలాంటివన్నీ సినిమాల్లో చేసుకోవాలని కౌంటర్ ఇచ్చారు. అయితే, స్పీకర్‌ ఎంత వారించినా టీడీపీ సభ్యులు వినిపించుకోకపోవడంతో సభను కాసేపు వాయిదా వేశారు తమ్మినేని.

Related Articles

ట్రేండింగ్

YSRCP Leaders Tension: టీడీపీ జనసేన కూటమి మేనిఫెస్టో విషయంలో వైసీపీ భయాలివేనా.. ఆ టెన్షన్ తగ్గట్లేదా?

YSRCP Leaders Tension:తెలుగుదేశం పార్టీ మేనిఫెస్టో విడుదల చేసిన తర్వాత జగన్ పార్టీలో భయం మొదలైనట్లుగా ఉంది. ఎందుకంటే వైసీపీ మేనిఫెస్టోలో ఉన్నా హామీల కన్నా కూటమి ఇచ్చిన హామీలు చాలా చాలా...
- Advertisement -
- Advertisement -