Anasuya: ఏమి మాట్లాడినా ఏమి అర్థాలు తీస్తారో.. మీడియాపై అనసూయ కామెంట్స్ వింటే షాకవ్వాల్సిందే!

Anasuya: తెలుగు ప్రేక్షకులకు నటి యాంకర్ అనసూయ భరద్వాజ్ గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. ఇటీవల కాలంలో తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఎక్కువగా వార్తల్లో నిలుస్తున్న వారిలో అనసూయ కూడా ఒకరు.. తరచూ ఏదో ఒక విషయంతో వార్తల్లో నిలుస్తూనే ఉంది అనసూయ. మరి ముఖ్యంగా కాంట్రవర్సీల విషయంలో ఈమె ఎక్కువగా హైలైట్ అవుతుంది. ప్రస్తుతం నటిగా ఈమె ఫుల్ బిజీబిజీగా గడుపుతున్న విషయం తెలిసిందే. అనసూయ చేతిలో నాలుగు ఐదు సినిమాలు ఉన్నాయి. అయితే కెరియర్ పరంగా అనసూయ ఎంత బిజీగా ఉన్నప్పటికీ సోషల్ మీడియాలో ఫుల్ యాక్టివ్ గా ఉంటూ ఎప్పటికప్పుడు అభిమానులతో ముచ్చటిస్తూ ఉంటుంది.

అంతేకాకుండా సోషల్ మీడియాలో వరుసగా ఫోటో షూట్లను షేర్ చేస్తూ సోషల్ మీడియాలో నెగిటివ్ కామెంట్స్ ని కూడా ఎదుర్కొంటూ ఉంటుంది. కాగా ఒక వర్గం ప్రేక్షకులు అనసూయ ఏం మాట్లాడినా ఏ చిన్న పని చేసినా వెంటనే దాన్ని సోషల్ మీడియాలో షేర్ చేస్తూ తెగ వైరల్ చేస్తూ ఆమెపై విమర్శలు గుప్పిస్తూ ఉంటారు. ఇకపోతే శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వంలో మిర్యాల రవీందర్ రెడ్డి నిర్మించిన తాజా చిత్రం పెదకాపు1. తాజాగా ఈ సినిమా ట్రైలర్ ను విడుదల చేశారు. ఈ సందర్భంగా ఈవెంట్ నిర్వహించారు. కాగా ఈ పెదకాపు సినిమాలో అనసూయ కూడా కీలకపాత్రలో నటించింది.

సినిమా ట్రైలర్ లో అనసూయ పాత్రను చూసిన ప్రేక్షకులు రంగస్థలం సినిమా కంటే ఈ పాత్రకంటే మరింత గుర్తింపు దక్కడం ఖాయం అంటూ కామెంట్ చేస్తున్నారు.. కాగా ఈ సినిమా ప్రచారంలో భాగంగా మాట్లాడుతూ ఈ సినిమా…ట్రైలర్ ఎలా ఉందొ అందరిలానే నేను కూడా ఈరోజు చూడాలి అనుకున్నాను, చూసాను. చాలా సంతోషంగా వుంది. ఈ సినిమాలో భాగం అయినందుకు, అంత మంచి పాత్ర దర్శకుడు తనకి ఇచ్చినందుకు అని చెప్పింది. ఆలా అంటూనే ఏమి మాట్లాడాలన్నా చాలా టెన్షన్ గా ఉంది. ఏమి మాట్లాడినా ఏమి అర్థాలు తీస్తారో అని కూడా అంది. సినిమా గురించి మాట్లాడితే, అదే రాస్తారు, వివాదాలు గురించి మాట్లాడితే వాటి గురించే రాస్తారు. అంతే కానీ వేరే ఎందుకు రాస్తారో మరి ఆమె ఎందుకు ఆలా అన్నదో ఆమెకే తెలియాలి. ఈ సందర్భంగా ఈవెంట్లో అనసూయ చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.

Related Articles

ట్రేండింగ్

CM Jagan: కూటమి విజయాన్ని ఫిక్స్ చేసిన జగన్.. మేనిఫెస్టో హామీలతో బొక్కా బోర్లా పడ్డారా?

CM Jagan: త్వరలోనే అసెంబ్లీ ఎన్నికలు జరగబోతున్నటువంటి తరుణంలో పెద్ద ఎత్తున ప్రచార కార్యక్రమాలలో నిర్వహిస్తున్నారు. అయితే వైసిపి అధినేత జగన్మోహన్ రెడ్డి వై నాట్ 175 అంటూ ప్రచార కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు....
- Advertisement -
- Advertisement -