Anasuya: హోటల్ వెయిటర్స్ తో కలిసి అనసూయ స్టెప్స్.. అదరహో అనేలా?

Anasuya: అందాల యాంకర్ అనసూయ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. `జబర్దస్త్` షో ద్వారా ఈమె మంచి పాపులారిటీ సంపాదించుకున్నారు. వరుస సినిమాలు చేస్తూ ప్రస్తుతం బిజీగా ఉన్నారు. ప్రస్తుతం ఈ అమ్మడు జబర్దస్త్ షో నుంచి వెళ్లిపోయింది. మరో మంచి షోతో ప్రేక్షకుల ముందుకు వస్తానని చెబుతోంది. తన ఫ్యామిలీతో సమయం గడుపుతూ పలు సుదూర ప్రయాణాలు చేస్తోంది.

 

తాజాగా తన ఫ్యామిలీతో టూర్ వెళ్లినప్పుడు ఓ హోటల్ లో వెయిటర్లతో కలిసి ఆమె డ్యాన్స్ వేశారు. ప్రస్తుతం ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. రారా రక్కమ్మ అనే పాటకు వెయిటర్లతో కలిసి అనసూయ స్టెప్పులేసింది. చిట్యాలలోని ఓ ప్లాజా వద్ద ఆమె వెయిటర్లతో కలిసి కాలుకదిపింది. ఈ వీడియోను అనసూయ తన ఇన్ స్టాగ్రామ్ ద్వారా అభిమానులతో పంచుకుంది. అను మాస్ స్టెప్పులకు ఫ్యాన్స్ ఫిదా అవ్వడమే కాకుండా రంగమ్మత్త డ్యాన్స్ అదుర్స్ అంటూ కామెంట్స్ చేస్తున్నారు.

 

అనసూయ జబర్దస్త్ షో చేస్తుండగా పలువురు ఆమె బాడీ షేమింగ్ పై కామెంట్లు చేశారు. ఆ సమయంలో ఆమె వారిపై ఆగ్రహం వ్యక్తం చేసింది. తనను కామెంట్ చేసే ఆర్టిస్టులపై విమర్శలు చేస్తూ షో నుంచి వెళ్లిపోయింది. ఆ తర్వాత స్టార్ మాలోనే సూపర్ సింగర్ జూనియర్స్ షోకి కూడా ఆమె హోస్ట్ గా వ్యవహరించింది. ఆ సీజన్ పూర్తవ్వడంతో ప్రస్తుతం అనసూయ ఖాళీగానే ఉంది. షోలు లేకపోయినప్పటికీ ప్రస్తుతం అనసూయ చేతిలో పదికిపైగా సినిమాలున్నాయి. తెలుగు, తమిళం, మలయాళంలో ఆమె సినిమాలు చేస్తూ బిజీగా ఉన్నారు.

 

ఎటువంటి టీవీ షోలో చేయకపోవడంతో ప్రస్తుతం అనసూయ ఫోటో షూట్ చేయడం లేదు. దీంతో ఆమె ఫోటోలు చూడకపోవడంతో ఆమె అభిమానులు అసంతృప్తితో ఉన్నారు. నెటిజన్లు కూడా గ్లామర్‌ ఫోటోలు లేవని సోషల్ మీడియా ద్వారా అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నారు. అయితే త్వరలోనే మరో పాపులర్ షో ద్వారా ప్రేక్షకుల ముందుకు రానున్నట్లు అనసూయ చెప్పుకొచ్చారు. దీంతో ఫ్యాన్స్ ఆనందం వ్యక్తం చేస్తున్నారు.

Related Articles

ట్రేండింగ్

Chandrababu Naidu: చంద్రబాబు నాయుడు రెండో సంతకం ఆ ఫైలుపైనే.. ఆ యాక్ట్ ను రద్దు చేయనున్నారా?

Chandrababu Naidu: ఎన్నికల ప్రచారంలో భాగంగా చంద్రబాబు నాయుడు ప్రకాశం జిల్లాలోని చీరాలలో నిర్వహించిన ప్రజాగళం సభలో మాట్లాడారు. తాము అధికారంలోకి వస్తే చేయబోయే కార్యకలాపాల గురించి ఆ సభలో మాట్లాడారు. అధికారంలోకి...
- Advertisement -
- Advertisement -